Rajasthan Vs Bengaluru: రాయల్స్ సమరం
ఐపీఎల్లో రసవత్తర సమరానికి వేళెంౖది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ను ఢీకొంటుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న రెండు జట్ల మధ్య పోరు హోరీహోరీగా సాగుతుందని భావిస్తున్నారు.
బెంగళూరు × రాజస్థాన్ ఎలిమినేటర్ నేడు
రాత్రి 7.30 నుంచి
అహ్మదాబాద్: ఐపీఎల్లో రసవత్తర సమరానికి వేళైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ను ఢీకొంటుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న రెండు జట్ల మధ్య పోరు హోరీహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. టోర్నీలో రాజస్థాన్, బెంగళూరుల ప్రయాణం చాలా భిన్నంగా సాగింది. పరస్పర భిన్న రీతిలో ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన ఈ జట్లు.. భిన్నమైన మానసిక స్థితిలో సమరానికి సిద్ధమయ్యాయి.
రాజస్థాన్ ఇలా..
మొత్తంగా చూస్తే లీగ్ దశలో రాజస్థాన్ రికార్డే మెరుగ్గా ఉంది. బలమైన బ్యాటింగ్, ప్రభావవంతమైన బౌలింగ్తో చాలా రోజులు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆ జట్టు చాలా ముందే ప్లేఆఫ్స్లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. రాజస్థాన్ టాప్-2లో నిలవడం ఖాయమనే అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా లయ తప్పిన ఆ జట్టు పేలవ ఫామ్తో ప్లేఆఫ్స్లో అడుగుపెడుతోంది. వర్షం కారణంగా ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు కావడానికి ముందు వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిన ఆ జట్టు.. కాస్త సన్నగిల్లిన విశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. ప్రత్యర్థితో సమంగా కనిపిస్తున్నప్పటికీ అద్భుత ఫామ్లో ఉన్న ఆర్సీబీతో పోరు రాయల్స్కు పెద్ద సవాలే. పైగా బట్లర్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. యశస్వి జైస్వాల్ (348), సంజు శాంసన్ (504), రియాన్ పరాగ్ (531) ఎలా చెలరేగుతారన్న దానిపైనే ఆ జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌల్ట్, సందీప్ శర్మ, అశ్విన్, చాహల్ వంటి వారితో రాయల్స్ బౌలింగ్ కూడా బాగానే ఉంది.
ఆర్సీబీ అలా..
టోర్నీలో బెంగళూరు పుంజుకున్న తీరు అద్భుతం. తొలి ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓడిన ఆ జట్టు.. ఆఖరి ఆరు మ్యాచ్ల్లో విజయాలతో ప్లేఆఫ్స్కు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాయల్స్కు భిన్నంగా.. బ్యాటు, బంతితో అదిరే ఫామ్తో పోరుకు సిద్ధమైంది. రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఆర్సీబీనే మెరుగ్గా కనిపిస్తోంది. కోహ్లి (708) సూపర్ ఫామ్ ఆ జట్టుకు పెద్ద సానుకూలాంశం. ఇంకా డుప్లెసిస్ (421), పటీదార్ (361), దినేశ్ కార్తీక్ (315), గ్రీన్ (228), మ్యాక్స్వెల్లతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. మ్యాక్స్వెల్ ఫామ్ను అందుకుంటే బెంగళూరుకు తిరుగుండదు. సిరాజ్, దయాళ్, గ్రీన్, ఫెర్గూసన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.
ముఖాముఖిలో..
ఐపీఎల్లో రెండు జట్లు ఇప్పటివరకు 30 సార్లు తలపడగా ఆర్సీబీ 15 మ్యాచ్ల్లో, రాజస్థాన్ 12 మ్యాచ్ల్లో నెగ్గాయి. మూడు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. ఈ సీజన్లో ఈ జట్లు ఒకేసారి తలపడగా.. రాయల్స్ పైచేయి సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు