Rajasthan vs Lucknow: లఖ్నవూతో మ్యాచ్.. యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగేనా?
సూపర్ సండేలో నేడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తొలుత రాజస్థాన్ - లఖ్నవూ జట్లు జయపుర వేదికగా తలపడనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో రాజస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. లఖ్నవూతో జైపుర్ వేదికగా తలపడనుంది. రాజస్థాన్ టీమ్లో స్టార్ ప్లేయర్లకు కొదవేం లేదు. ఇటు లఖ్నవూలోనూ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఉన్నారు. దీంతో ఈ పోరూ రసవత్తరంగా ఉండటం ఖాయం.
రాజస్థాన్లో వీరే కీలకం..
రాజస్థాన్ తన సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుంది. స్పెషల్ అట్రాక్షన్ మాత్రం యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్. భారత్ తరఫున అరంగేట్రం చేసి అదరగొట్టిన వీరిద్దరూ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా యశస్వి నిలిచాడు. గత సీజన్లోనూ 14 మ్యాచుల్లో 625 పరుగులు సాధించాడు. వచ్చే జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఈ టోర్నీలో ప్రదర్శన కీలకమవుతుందని అంతా భావిస్తున్న వేళ.. మెరుగ్గా ఆడితే చోటు దక్కించుకొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉండే రాజస్థాన్కు కాస్త లక్ కలిసిరావాలి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ ఛాంపియన్గా అవతరించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ను దక్కించుకోలేకపోయింది. ఫైనల్ వరకూ వెళ్లినా నిరాశతో వెనుదిరిగింది. బౌలింగ్లో అశ్విన్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ కీలకం. వీరే కాకుండా ప్రసిధ్ కృష్ణ, తనుష్ కొటియన్. నాండ్రీ బర్గర్ వంటి ఆటగాళ్లూ ఉన్నారు.
కేఎల్పైనే దృష్టి..
లఖ్నవూ జట్టుకు స్టార్ క్యాంపెయినర్ కేఎల్ రాహుల్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ మధ్యలోనే గాయం కారణంగా వైదొలిగిన అతడు ఇప్పుడు ఈ లీగ్లో ఆడేందుకు వస్తున్నాడు. ఇటీవలే బీసీసీఐ ఫిట్నెస్పై స్పష్టత ఇవ్వడంతో మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్లో రాణించడమూ కేఎల్కు ముఖ్యమే. పొట్టి కప్లో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. దేవదుత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్, స్టొయినిస్ బ్యాటింగ్లో కీలకం. ఆసీస్పై సంచలన స్పెల్తో అందరి దృష్టిని ఆకర్షించిన షామార్ జోసెఫ్ తొలిసారి భారీ లీగ్లో ఆడుతున్నాడు. కేల్ మయేర్, ఆయుష్ బదోనీ గత సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారి ఫామ్లోకి రావడం లఖ్నవూ విజయాలకు అత్యంత అవసరం.
తుది జట్లు (అంచనా):
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మయేర్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, రియాన్ పరాగ్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ,
లఖ్నవూ: దేవదత్ పడిక్కల్, డికాక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్, షామార్ జోసెఫ్, శివమ్ మావి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం