Rajasthan vs Lucknow: లఖ్నవూతో మ్యాచ్.. యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగేనా?
సూపర్ సండేలో నేడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. తొలుత రాజస్థాన్ - లఖ్నవూ జట్లు జయపుర వేదికగా తలపడనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్లో రాజస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. లఖ్నవూతో జైపుర్ వేదికగా తలపడనుంది. రాజస్థాన్ టీమ్లో స్టార్ ప్లేయర్లకు కొదవేం లేదు. ఇటు లఖ్నవూలోనూ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఉన్నారు. దీంతో ఈ పోరూ రసవత్తరంగా ఉండటం ఖాయం.
రాజస్థాన్లో వీరే కీలకం..
రాజస్థాన్ తన సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుంది. స్పెషల్ అట్రాక్షన్ మాత్రం యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్. భారత్ తరఫున అరంగేట్రం చేసి అదరగొట్టిన వీరిద్దరూ ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా యశస్వి నిలిచాడు. గత సీజన్లోనూ 14 మ్యాచుల్లో 625 పరుగులు సాధించాడు. వచ్చే జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఈ టోర్నీలో ప్రదర్శన కీలకమవుతుందని అంతా భావిస్తున్న వేళ.. మెరుగ్గా ఆడితే చోటు దక్కించుకొనేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉండే రాజస్థాన్కు కాస్త లక్ కలిసిరావాలి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ ఛాంపియన్గా అవతరించిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ను దక్కించుకోలేకపోయింది. ఫైనల్ వరకూ వెళ్లినా నిరాశతో వెనుదిరిగింది. బౌలింగ్లో అశ్విన్, అవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ కీలకం. వీరే కాకుండా ప్రసిధ్ కృష్ణ, తనుష్ కొటియన్. నాండ్రీ బర్గర్ వంటి ఆటగాళ్లూ ఉన్నారు.
కేఎల్పైనే దృష్టి..
లఖ్నవూ జట్టుకు స్టార్ క్యాంపెయినర్ కేఎల్ రాహుల్ అనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ మధ్యలోనే గాయం కారణంగా వైదొలిగిన అతడు ఇప్పుడు ఈ లీగ్లో ఆడేందుకు వస్తున్నాడు. ఇటీవలే బీసీసీఐ ఫిట్నెస్పై స్పష్టత ఇవ్వడంతో మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్లో రాణించడమూ కేఎల్కు ముఖ్యమే. పొట్టి కప్లో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉంది. దేవదుత్ పడిక్కల్, క్వింటన్ డికాక్, కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్, స్టొయినిస్ బ్యాటింగ్లో కీలకం. ఆసీస్పై సంచలన స్పెల్తో అందరి దృష్టిని ఆకర్షించిన షామార్ జోసెఫ్ తొలిసారి భారీ లీగ్లో ఆడుతున్నాడు. కేల్ మయేర్, ఆయుష్ బదోనీ గత సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారి ఫామ్లోకి రావడం లఖ్నవూ విజయాలకు అత్యంత అవసరం.
తుది జట్లు (అంచనా):
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మయేర్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, రియాన్ పరాగ్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, చాహల్, సందీప్ శర్మ,
లఖ్నవూ: దేవదత్ పడిక్కల్, డికాక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోహ్సిన్ ఖాన్, షామార్ జోసెఫ్, శివమ్ మావి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్