Rajasthan vs Bengaluru: ఆర్సీబీ ఇంటికి.. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ విజయం
ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఫైనల్ బెర్త్ కోసం రెండో క్వాలిఫయర్లో హైదరాబాద్తో రాజస్థాన్ తలపడనుంది.
అహ్మదాబాద్: వరుసగా ఆరు విజయాలు సాధించి అనుహ్యంగా ప్లేఆఫ్స్కు దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎలిమినేటర్ మ్యాచ్లో భంగపాటు తప్పలేదు. ఈ మ్యాచ్లో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యాన్ని సంజు సేన 6 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (45; 30 బంతుల్లో 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన హెట్మయర్ (26; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. సంజు శాంసన్ (17) పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ (8) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. చివర్లో హెట్మయర్, పరాగ్ ఒకే ఓవర్లో ఔటవడంతో కాస్త ఉత్కంఠ ఏర్పడింది. కానీ, రోమన్ పావెల్ (16*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో బెంగళూరు ఇంటిముఖం పట్టింది. శుక్రవారం చెన్నైలో క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ తలపడనుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో ఒక్కరూ కూడా భారీ స్కోరు చేయలేదు. రజత్ పటిదార్ (34; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ (33; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లామ్రోర్ (32; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కామెరూన్ గ్రీన్ (27), డుప్లెసిస్ (17), దినేశ్ కార్తిక్ (11) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, అశ్విన్ 2, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.
తొలి ఆటగాడిగా విరాట్ రికార్డు
ఈ మ్యాచ్లో 33 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 8 వేల పరుగుల (8004 రన్స్) మైలురాయిని అందుకున్నాడు. టోర్నీలో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (6769), రోహిత్ శర్మ (6628) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లి జోరు అందుకునేనా..
ఐర్లాండ్ను చిత్తుచేసి.. పాకిస్థాన్ ముప్పును దాటి.. అమెరికాపై ఆధిపత్యంతో టీ20 ప్రపంచకప్లో సూపర్-8 చేరిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్కు సిద్ధమైంది. తన చివరి గ్రూప్ మ్యాచ్లో శనివారం కెనడాతో తలపడనుంది. -
పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్
ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మారిన 2024 టీ20 ప్రపంచకప్లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాక్ తగిలింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
అఫ్గాన్ అదరహో..
ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ నాకౌట్ చేరే రికార్డున్న న్యూజిలాండ్కు షాక్. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి రౌండ్ కూడా దాటకుండానే ఇంటిముఖం పట్టింది. -
ఇంగ్లాండ్ చేతిలో ఒమన్ చిత్తు
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. గ్రూపు-బి పోరులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తుచేసింది. -
మ్యాచ్ పూర్తవగానే సాఫ్ట్వేర్ పని..
భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు అమెరికా జట్టులో ప్రధాన పేసర్. పాకిస్థాన్పై సూపర్ ఓవర్లో యుఎస్ సంచలన విజయం సాధించడంలో అతనే కీలకం. -
ప్రణయ్ పరాజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మల పోరాటం ముగిసింది. -
సెమీస్లో నగాల్
భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ పెరుగియా టెన్నిస్ ఛాలెంజర్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. -
మేం అలా ఎప్పటికీ చేయం
టీ20 ప్రపంచకప్ నుంచి ఇంగ్లాండ్ను బయటకు పంపేలా తాము నెట్రన్రేట్ను తారుమారు చేయాలనుకుంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. -
సూపర్-8కు అమెరికా.. వర్షంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతు
ఇంకో మ్యాచ్ మిగిలిఉండగానే టీ20 ప్రపంచకప్ సూపర్-8 రేసు నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.
తాజా వార్తలు (Latest News)
-
క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం: యనమల రామకృష్ణుడు
-
డ్రోన్తో ట్రాఫిక్ పర్యవేక్షించి.. నియంత్రించి
-
మూగ యువతిపై సామూహిక అత్యాచారం
-
మహిళలు నిల్చోలేక.. పురుషులు కూర్చోలేక..
-
తక్కువ సమయం.. ఎక్కువ మందికి ప్రయోజనం
-
నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు.. నేడు ప్రొటోకాల్తో లోపలికి..