Rajasthan vs Bengaluru: ఆర్సీబీ ఇంటికి.. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ విజయం
ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరుపై రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఫైనల్ బెర్త్ కోసం రెండో క్వాలిఫయర్లో హైదరాబాద్తో రాజస్థాన్ తలపడనుంది.
అహ్మదాబాద్: వరుసగా ఆరు విజయాలు సాధించి అనుహ్యంగా ప్లేఆఫ్స్కు దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎలిమినేటర్ మ్యాచ్లో భంగపాటు తప్పలేదు. ఈ మ్యాచ్లో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యాన్ని సంజు సేన 6 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (45; 30 బంతుల్లో 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (36; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన హెట్మయర్ (26; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. సంజు శాంసన్ (17) పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ (8) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. చివర్లో హెట్మయర్, పరాగ్ ఒకే ఓవర్లో ఔటవడంతో కాస్త ఉత్కంఠ ఏర్పడింది. కానీ, రోమన్ పావెల్ (16*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో బెంగళూరు ఇంటిముఖం పట్టింది. శుక్రవారం చెన్నైలో క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ తలపడనుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో ఒక్కరూ కూడా భారీ స్కోరు చేయలేదు. రజత్ పటిదార్ (34; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్. విరాట్ కోహ్లీ (33; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), మహిపాల్ లామ్రోర్ (32; 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కామెరూన్ గ్రీన్ (27), డుప్లెసిస్ (17), దినేశ్ కార్తిక్ (11) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, అశ్విన్ 2, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.
తొలి ఆటగాడిగా విరాట్ రికార్డు
ఈ మ్యాచ్లో 33 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 8 వేల పరుగుల (8004 రన్స్) మైలురాయిని అందుకున్నాడు. టోర్నీలో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తర్వాతి స్థానాల్లో శిఖర్ ధావన్ (6769), రోహిత్ శర్మ (6628) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల