Mumbai vs Rajasthan: ఖాతా తెరవని ముంబయి.. హ్యాట్రిక్ కొట్టిన రాజస్థాన్
ముంబయితో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఈ ఐపీఎల్లో ముంబయి ఇంకా ఖాతా తెరవలేదు.
ముంబయి: ఐపీఎల్ 2024లో ముంబయి (Mumbai)ని ఓటమి కష్టాలు వీడటం లేదు. రాజస్థాన్ (Rajasthan)తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడు మ్యాచ్లు ఆడిన ముంబయి ఇంత వరకు గెలుపు రుచి చూడకపోగా, రాజస్థాన్ వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. హార్దిక్ సేనను 125 పరుగులకే కట్టడి చేసింది. ట్రెంట్ బౌల్ట్ (3/22), యుజ్వేంద్ర చాహల్ (3/11), బర్గర్ (2/32) ఆ జట్టు పతనాన్ని శాసించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రియాన్ పరాగ్ (54*; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ శతకంతో మెరిశాడు. యశస్వి జైస్వాల్ (10), జోస్ బట్లర్ (13), సంజు శాంసన్ (12), రవిచంద్రన్ అశ్విన్ (16), శుభమ్ దూబె (8*) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ (3/20) ఆకట్టుకోగా.. క్వెనా మఫాకా ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి.. రాజస్థాన్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. ట్రెంట్ బౌల్ట్ టాప్ ఆర్డర్ పనిపట్టగా.. యుజువేంద్ర చాహల్ మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశాడు. ముంబయి బ్యాటర్లలో రోహిత్ శర్మ (0), నమన్ ధిర్ (0), డెవాల్డ్ బ్రెవిస్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరారు. ఈ ముగ్గురూ బౌల్ట్ బౌలింగ్లోనే ఔటయ్యారు. ఇషాన్ కిషన్ (16)ను బర్గర్ వెనక్కి పంపడంతో ముంబయి 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ (32; 29 బంతుల్లో 2 సిక్స్లు), హార్దిక్ పాండ్య (34; 21 బంతుల్లో 6 ఫోర్లు) ముంబయిని ఆదుకున్నారు. చివర్లో టిమ్ డేవిడ్ (17; 24 బంతుల్లో) ధాటిగా ఆడలేకపోయాడు. జస్ప్రీత్ బుమ్రా (8*), ఆకాశ్ మధ్వల్ (4*) జాగ్రత్తగా ఆడటంతో ముంబయి ఆలౌట్ నుంచి తప్పించుకుంది.
మ్యాచ్ విశేషాలు
- రాజస్థాన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కిది 200వ ఐపీఎల్ మ్యాచ్.
- మ్యాచ్లో అర్ధ శతకం బాదిన రాజస్థాన్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఇప్పటివరకు అత్యధిక పరుగులు (181) చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
- ముంబయి కెప్టెన్గా హార్దిక్ పాండ్యకు తొలి మూడు మ్యాచ్ల్లో పరాభవం ఎదురుకాగా.. గుజరాత్ సారథిగా మొదటి మ్యాచ్ల్లో జట్టును గెలిపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం