IND vs ENG: రాంచీ టెస్టు.. భారత్ బౌలింగ్ వ్యూహమేంటి?
ఐదు టెస్టుల సిరీస్లో నాలుగో మ్యాచ్ రాంచీ వేదికగా జరగనుంది. ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రాంచీ మైదానం వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే పర్యటక జట్టు ఫైనల్ XIను ప్రకటించింది. పిచ్ పరిస్థితిని అంచనా వేసేందుకు ఇబ్బందిపడుతున్న తరుణంలో.. టీమ్ఇండియా ఎలా బరిలోకి దిగుతుందా? అని ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సీనియర్ పేసర్ బుమ్రా లేకుండానే భారత్ ఈ మ్యాచ్ను ఆడేందుకు సిద్ధమైంది.
భారత్ మైదానాలు ఎక్కువగా టర్నింగ్ పిచ్లను కలిగిఉంటాయి. ఇక్కడికి వచ్చే ప్రత్యర్థులు సైతం అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతాయి. కానీ, ఇంగ్లాండ్ మాత్రం ఇద్దరు స్పెషలిస్టులతోనే నెట్టుకొస్తోంది. టీమ్ఇండియా మాత్రం కనీసం ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. ఇప్పుడు రాంచీలోనూ తొలి రోజు మినహా మొత్తం మ్యాచ్లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలోనూ ఇంగ్లాండ్ ఇద్దరు స్పెషలిస్ట్ + ఒక పార్ట్ టైమ్ స్పిన్నర్తో కూడిన జట్టును ప్రకటించింది. భారత్ మాత్రం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందులో ముగ్గురు బ్యాటింగ్ చేయగలగడం టీమ్ఇండియాకే బలం.
నలుగురా..? ముగ్గురా?
భారత స్క్వాడ్లో నలుగురు ఆల్రౌండర్లు ఉన్నారు. అందరూ స్పిన్ వేసేవారే. బ్యాటింగ్లోనూ ఓ చేయి వేయగలరు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అతడు గత మ్యాచ్లో విలువైన పరుగులూ చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తే మాత్రం.. అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ పక్కాగా ఉంటారు. నాలుగో బౌలర్గా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రేసులో నిలుస్తారు. ఇద్దరూ ఎడమచేతివాటం బ్యాటర్లే. కానీ, సుందర్ కుడిచేతి బౌలర్ కావడం విశేషం. అయితే, అక్షర్ పటేల్ రెండు టెస్టులు ఆడి 5 వికెట్లు పడగొట్టాడు. సుందర్ బెంచ్కే పరిమితం కావాల్సివచ్చింది. పేస్ బౌలర్లలో సిరాజ్ స్థానం ఫిక్స్ అయిపోయింది. రెండో బౌలర్ను తీసుకుంటారా..? నాలుగో స్పిన్నర్ను ఎంచుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తడం సహజమే. అయితే, ఆకాశ్ దీప్ అరంగేట్రం ఖాయమనే వార్తలూ వస్తున్నాయి. దీంతో ముగ్గురు స్పిన్నర్లు + ఇద్దరు పేసర్లతోనే తుది జట్టు ఉంటుందని తెలుస్తోంది. బ్యాటింగ్ విభాగంలో భారత్కు ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. రజత్ మినహా అందరూ రాణిస్తున్నారు. మరోసారి అతడికి అవకాశం ఇచ్చేందుకు మేనేజ్మెంట్ ఆసక్తిగానే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే