BCCI Contracts: ఆ ఇద్దరు బలంగా తిరిగివస్తారు: రవిశాస్త్రి
బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల్లో ఇద్దరిని తప్పించడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. మేనేజ్మెంట్ ఆదేశాలను లెక్క చేయకపోవడం వల్లే ఇదంతా చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లను దక్కించుకోవడంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యారు. దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడం వల్లే వారికి అవకాశం కల్పించలేదు. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ట్విటర్ వేదికగా అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘‘క్రికెట్లో ఇలాంటవన్నీ సహజమే. స్ఫూర్తితో పునరాగమనం చేయాలి. శ్రేయస్, ఇషాన్ బాధపడొద్దు. జాతీయ జట్టులోకి ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని వచ్చారు. ఇప్పుడు మరింత బలంగా పుంజుకోవాలి. గతంలో సాధించిన లక్ష్యాలు విలువల గురించి చెబుతాయి. మీరు మళ్లీ పైకి ఎదుగుతారనే నమ్మకం నాకుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
విభిన్నంగా స్పందించిన నెటిజన్లు
యువ క్రికెటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. శ్రేయస్, ఇషాన్తోపాటు పుజారా, రహానె, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, చాహల్కూ అవకాశం దక్కలేదు. శ్రేయస్, ఇషాన్ దేశవాళీలో ఆడకపోవడం వల్లే ఇవ్వలేదని వాదనపై సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు గుప్పించారు. బీసీసీఐ పక్షపాతం చూపిస్తోందని కామెంట్లు చేశారు.
‘‘రంజీ మ్యాచ్లనే పక్కన పెట్టేసిన హార్దిక్ పాండ్యకు కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ మాత్రం కేవలం ఒక్క మ్యాచ్ను మిస్ అయినందుకే తొలగించడం అన్యాయం’’
‘‘ప్రపంచ కప్లో 10 మ్యాచులకుగాను 500+ స్కోరు చేసిన ఆటగాడికి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. శ్రేయస్కు ఇది కష్టకాలం. మేమంతా అతడికి మద్దతుగా ఉంటాం. తప్పకుండా తిరిగి వస్తాడు’’
‘‘రంజీ మ్యాచ్లను ఆడకుండా ఉండిపోయిన ఆటగాళ్లు ఇషాన్, శ్రేయస్ మాత్రమే కాదు. మిగతా టాప్ ప్లేయర్లది ఇదే దారి. ఇదంతా ఓ డ్రామాలా ఉంది. వెన్ను నొప్పి, ఫిట్నెస్పై దృష్టిసారించినప్పుడు బీసీసీఐ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదు’’
‘‘కుల్దీప్ను ఏ గ్రేడ్, హార్దిక్ పాండ్యను బి గ్రేడ్, రిషభ్ పంత్ అంతర్జాతీయ జట్టులోకి వచ్చే వరకు గ్రేడ్ ‘సి’లో ఉంచితే బాగుండేది. పంత్ కుదురుకున్నాక అప్గ్రేడ్ చేయాల్సింది. శ్రేయస్, ఇషాన్ను పక్కన పెట్టడం సరైంది కాదు. వారికి అవకాశం ఇస్తే బాగుండేది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ