BCCI Contracts: ఆ ఇద్దరు బలంగా తిరిగివస్తారు: రవిశాస్త్రి
బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల్లో ఇద్దరిని తప్పించడం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. మేనేజ్మెంట్ ఆదేశాలను లెక్క చేయకపోవడం వల్లే ఇదంతా చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లను దక్కించుకోవడంలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యారు. దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడం వల్లే వారికి అవకాశం కల్పించలేదు. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ట్విటర్ వేదికగా అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘‘క్రికెట్లో ఇలాంటవన్నీ సహజమే. స్ఫూర్తితో పునరాగమనం చేయాలి. శ్రేయస్, ఇషాన్ బాధపడొద్దు. జాతీయ జట్టులోకి ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని వచ్చారు. ఇప్పుడు మరింత బలంగా పుంజుకోవాలి. గతంలో సాధించిన లక్ష్యాలు విలువల గురించి చెబుతాయి. మీరు మళ్లీ పైకి ఎదుగుతారనే నమ్మకం నాకుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
విభిన్నంగా స్పందించిన నెటిజన్లు
యువ క్రికెటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. శ్రేయస్, ఇషాన్తోపాటు పుజారా, రహానె, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, చాహల్కూ అవకాశం దక్కలేదు. శ్రేయస్, ఇషాన్ దేశవాళీలో ఆడకపోవడం వల్లే ఇవ్వలేదని వాదనపై సోషల్ మీడియాలో అభిమానులు విమర్శలు గుప్పించారు. బీసీసీఐ పక్షపాతం చూపిస్తోందని కామెంట్లు చేశారు.
‘‘రంజీ మ్యాచ్లనే పక్కన పెట్టేసిన హార్దిక్ పాండ్యకు కాంట్రాక్ట్ లభించింది. శ్రేయస్ మాత్రం కేవలం ఒక్క మ్యాచ్ను మిస్ అయినందుకే తొలగించడం అన్యాయం’’
‘‘ప్రపంచ కప్లో 10 మ్యాచులకుగాను 500+ స్కోరు చేసిన ఆటగాడికి కాంట్రాక్ట్ ఇవ్వలేదు. శ్రేయస్కు ఇది కష్టకాలం. మేమంతా అతడికి మద్దతుగా ఉంటాం. తప్పకుండా తిరిగి వస్తాడు’’
‘‘రంజీ మ్యాచ్లను ఆడకుండా ఉండిపోయిన ఆటగాళ్లు ఇషాన్, శ్రేయస్ మాత్రమే కాదు. మిగతా టాప్ ప్లేయర్లది ఇదే దారి. ఇదంతా ఓ డ్రామాలా ఉంది. వెన్ను నొప్పి, ఫిట్నెస్పై దృష్టిసారించినప్పుడు బీసీసీఐ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదు’’
‘‘కుల్దీప్ను ఏ గ్రేడ్, హార్దిక్ పాండ్యను బి గ్రేడ్, రిషభ్ పంత్ అంతర్జాతీయ జట్టులోకి వచ్చే వరకు గ్రేడ్ ‘సి’లో ఉంచితే బాగుండేది. పంత్ కుదురుకున్నాక అప్గ్రేడ్ చేయాల్సింది. శ్రేయస్, ఇషాన్ను పక్కన పెట్టడం సరైంది కాదు. వారికి అవకాశం ఇస్తే బాగుండేది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం