Ravi Shastri: అలాంటి సిరీస్లతో సమయం వృథా: రవిశాస్త్రి
రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, భవిష్యత్ ఇలాంటి సిరీస్లు నిర్వహించొద్దని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) బీసీసీఐకి సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దక్షిణాఫ్రికా టూర్లో టీమ్ ఇండియా (Team India) మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడింది. టెస్టు, టీ20 సిరీస్లు 1-1 తేడాతో సమం కాగా.. వన్డే సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి టెస్టు మూడు రోజుల్లో ముగియగా.. కేప్టౌన్లో జరిగిన రెండో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయింది. 107 ఓవర్లలోనే ఫలితం వచ్చింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్ ఇదే. ఈ నేపథ్యంలో టూర్లో రెండే టెస్టు మ్యాచ్లు నిర్వహించడంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు టెస్టు మ్యాచ్లతో సిరీస్ను నిర్వహించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నాడు.
‘‘ఈ టెస్ట్ సిరీస్ చూశాక మరోసారి కేవలం రెండు టెస్టుల సిరీస్లు ఆడకుండా బీసీసీఐ (BCCI) జాగ్రత్త వహించాలి. ఏదైనా బోర్డు (దేశం) ఇలాంటి తరహా సిరీస్ కోసం ఆహ్వానిస్తే ‘మేము రాం’ అని చెప్పాలి. రెండు టెస్టుల సిరీస్ను నిర్వహించడం వల్ల సమయం వృథా. అది స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా’’ అని సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి