Ashwin For ODI WC 2023: అశ్విన్ వన్డే వరల్డ్ కప్ ఆడతాడా..? రోహిత్ సమాధానంతో కొత్త చర్చ!
ఆసియా కప్లో ఆడిన అక్షర్ బంగ్లాతో మ్యాచ్లో గాయపడ్డాడు. మెగా టోర్నీ నాటికి కోలుకుని వస్తాడా..? లేదా..? అనేది అనుమానంగా మారింది. ఈ క్రమంలో అశ్విన్కు అవకాశం లభిస్తుందనే వాదనా మరో వైపు ఉంది. వరల్డ్ కప్ కోసం జట్టులో ఏమైనా మార్పులు చేసుకోవడానికి కాస్త సమయం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ (Asia Cup 2023) విజేతగా నిలిచిన భారత్ ఇక మెగా టోర్నీ వరల్డ్ కప్ (ODI WC 2023) కోసం సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఆలోగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను టీమ్ఇండియా ఆడనుంది. ఇప్పటికే ఆసీస్ తమ స్క్వాడ్ను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకా భారత జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఆసియా కప్ సూపర్ -4లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆసియా కప్ ఫైనల్కు తీసుకున్నారు. ఆసీస్తో వన్డే సిరీస్తోపాటు వరల్డ్ కప్లో అక్షర్ పటేల్ ఆడతాడా? అనేది అనుమానస్పదంగానే ఉంది. ఈ క్రమంలో మరో సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) జట్టులోకి వస్తాడనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం కూడా మరోసారి చర్చకు దారితీసింది.
‘‘స్పిన్ ఆల్రౌండర్గా అశ్విన్ ఎప్పుడూ మా దృష్టిలో ఉంటాడు. అతడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా, బంగ్లాతో మ్యాచ్ ముగింపు సమయంలో అక్షర్ పటేల్కు గాయమైంది. వాషింగ్టన్ సుందర్ అప్పటికే సిద్ధంగా ఉండటంతో అతడిని ఎంపిక చేశాం. ఇలా సుందర్ను తీసుకోవడం వల్ల అతడికి ఆసియా గేమ్స్ కోసం సన్నద్ధమయ్యేందుకు అవకాశం లభించినట్లు అవుతుంది. ఇప్పటికే అతడు ఆసియా గేమ్స్ కోసం నిర్వహిస్తున్న క్యాంప్లో ఉండటంతో వెంటనే కొలంబోకు పిలిపించాం’’ అని రోహిత్ తెలిపాడు.
సిరాజ్తో ఏడు ఓవర్లే వేయించడానికి కారణమదే: రోహిత్ శర్మ
వాషింగ్టన్ సుందర్ అక్టోబర్లోనే జరగనున్న ఆసియా గేమ్స్లో పాల్గొంటాడు. మరోవైపు అక్షర్ పటేల్ కోలుకోకపోతే మాత్రం సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ అయిన అశ్విన్ను ఎంచుకొనేందుకు అవకాశాలు పుష్కలం. వరల్డ్ కప్ భారత్లోనే కాబట్టి ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్ మరింత ప్రభావం చూపిస్తాడనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!