Siraj in IND vs SL: సిరాజ్తో ఏడు ఓవర్లే వేయించడానికి కారణమదే: రోహిత్ శర్మ
అప్పటి వరకు టోర్నీలో ఒకటీ అరా వికెట్లు తీసిన సిరాజ్ (Siraj).. ఆసియా కప్ ఫైనల్లో (Asia Cup 2023) మాత్రం చెలరేగిపోయాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Siraj) ఆసియా కప్ ఫైనల్లో దుమ్ముదులిపేశాడు. శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ కావడంలో ఈ హైదరాబాదీ పేసర్ కీలక పాత్ర పోషించాడు. ఔట్, ఇన్ స్వింగ్ బౌలింగ్తో లంక బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కెరీర్లోనే అత్యుత్తమ (6/21) బౌలింగ్ గణాంకాలను నమోదు చేయడమే కాకుండా ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. అయితే, సిరాజ్ ఈ మ్యాచ్లో కేవలం ఏడు ఓవర్లను మాత్రమే విసిరాడు. మిగిలిన ఓవర్లను కూడా వేయించి ఉంటే తప్పకుండా మరికొన్ని వికెట్లను తన ఖాతాలో వేసుకొనేవాడనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. ఊపు మీదున్న ఇలాంటి పేసర్కు ఆ తర్వాత ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదనే దానిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
‘‘పేస్ బౌలింగ్ను చూసి నేను చాలా ఆనంద పడ్డా. ఇలాంటి ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించడం అద్భుతం. ప్రతి కెప్టెన్కూ ఇలాంటి అనుభవమే కలుగుతుంది. కాబట్టి, నేను వారికి భిన్నమేమీ కాదు. మనకు అద్భుతమైన పేస్ దళం ఉంది. ప్రతి ఒక్కరిలో విభిన్నమై బౌలింగ్ శైలి, నైపుణ్యాలు ఉన్నాయి. ఒకరు వేగంగా బంతులను సంధిస్తే.. మరొకరు స్వింగ్ చేస్తారు. అలాగే ఇంకొకరు బౌన్స్ రాబడతారు. ఇలాంటివారందరూ ఒకే జట్టులో ఉంటే ఆ అనుభూతి అద్భుతమనిపిస్తుంది.
సిరాజ్లో ఇలాంటి లక్షణాలు అన్నీ ఉండటం విశేషం. స్వింగ్, పేస్, బౌన్స్ వేయగలడు. అతడి ఏడు ఓవర్ల స్పెల్లో వీటన్నింటినీ చూశాం. స్లిప్లో ఉండి సిరాజ్ బౌలింగ్ను చూడటం సంతోషంగా అనిపించింది. సిరాజ్ ఏడు ఓవర్ల స్పెల్ను నిర్విరామంగా వేశాడు. దీంతో అతడికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని ట్రైయినర్ నుంచి సందేశం వచ్చింది. దీంతో రెస్ట్ ఇచ్చి స్పిన్నర్తో పాటు హార్దిక్తో కంటిన్యూ చేయించా. అయితే, హార్దిక్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లను తీయడంతో మళ్లీ సిరాజ్కు అవకాశం రాలేదు. గతంలో త్రివేండ్రం (తిరువనంతపురం)లోనూ వరుసగా 8-9 ఓవర్లు వేశాడు. వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో మరీ ఒత్తిడి ఎక్కువ లేకుండా ఉండాలనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ టోర్నీగా నిలిచిన కుల్దీప్ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ వేశాడు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM