Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
రవిచంద్రన్ అశ్విన్ను సుడిగాడు అంటున్నారు భారత క్రికెట్ అభిమానులు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎప్పుడో ముగిసిందనుకున్న అతడి కెరీర్.. మళ్లీ ఊపందుకుని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రపంచకప్ ఆడేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఈసారి వన్డే ప్రపంచకప్లో రవిచంద్రన్ అశ్విన్ ఆడతాడని రెండు వారాల ముందు ఎవరైనా అంటే నవ్వేవాళ్లు. కానీ అతను అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. గత రెండు టీ20 ప్రపంచకప్ల్లో అతను ఆడటం కూడా అనూహ్యమే.
కెరీర్లో కొన్నేళ్లు మూడు ఫార్మాట్లలోనూ కీలక బౌలర్గా ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. కానీ ఒక దశ దాటాక అతడికి పరిమిత ఓవర్ల క్రికెట్లో తిప్పలు తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్స్పిన్నర్లకు కాలం చెల్లింది. టీ20ల్లో బ్యాటర్ల విధ్వంసం పెరిగాక.. లెగ్స్పిన్నర్లకే జట్లు పెద్ద పీట వేశాయి. ఆఫ్స్పిన్నర్ల బౌలింగ్ను అలవోకగా ఆడేస్తుండటంతో అన్ని జట్లూ వారిని పక్కన పెట్టేయడం మొదలైంది. ఈ క్రమంలోనే అశ్విన్ 2017లో భారత టీ20 జట్టుకు దూరమయ్యాడు. నాలుగేళ్ల పాటు జట్టు ఛాయల్లోకే అతను రాలేదు. ఇక మళ్లీ అశ్విన్ను టీ20 జట్టులో చూస్తామని ఎవ్వరూ అనుకోలేదు. కానీ 2021 టీ20 ప్రపంచకప్కు అనుకోకుండా జట్టులో చోటు సంపాదించాడు అశ్విన్. యూఏఈలో జరిగిన ఆ ప్రపంచకప్లో జడేజా, కుల్దీప్లతో పాటు అశ్విన్కూ అవకాశం దక్కింది.
ఫామ్లో ఉన్న చాహల్ను పక్కన పెట్టి మరీ అశ్విన్కు అప్పుడు జట్టులో చోటిచ్చారు. అశ్విన్ ఆ టోర్నీలో ఏమంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. దీంతో ఆ టోర్నీ తర్వాత వేటు పడింది. ఇక మళ్లీ టీ20 జట్టులో అతడికి చోటు దక్కదనే అంతా అనుకున్నారు. కానీ గత ఏడాది టీ20 ప్రపంచకప్నకు గాయం వల్ల జడేజా అందుబాటులో లేకుండా పోవడం, కుల్దీప్ ఫామ్ కోల్పోవడంతో అవకాశం అశ్విన్ను వెతుక్కుంటూ వచ్చింది. ముందు కొన్ని మ్యాచ్ల్లో ఆడించి.. తర్వాత ప్రపంచకప్నకు ఎంపిక చేశారు. అందులో ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు అశ్విన్.
నెల ముందు అలా..
ఇక ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో అశ్విన్ ఆడబోతుండటం మాత్రం మిరాకిల్ అనే చెప్పాలి. ఏడాదిన్నర నుంచి అతడికి వన్డే జట్టులో చోటే లేదు. ఈ ఫార్మాట్ నుంచి అతను దాదాపుగా రిటైరైనట్లే భావించారు అంతా. అధికారికంగా ప్రకటన మాత్రమే చేయలేదు. నెల ముందు ప్రపంచకప్నకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై యూట్యూబ్లో విశ్లేషణ చేస్తూ కనిపించాడు అశ్విన్. తిలక్ వర్మకు చోటివ్వాలని డిమాండ్ కూడా చేశాడు. అలాంటివాడు ప్రపంచకప్ రేసులోకి రావడం అనూహ్యం. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లో అక్షర్ పటేల్ గాయపడటం అశ్విన్కు వరంగా మారింది. గాయం తీవ్రత ఎక్కువే కావడంతో అత్యవసరంగా ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం పడింది సెలక్టర్లకు. వాషింగ్టన్ సుందర్తో పాటు అశ్విన్నూ ఎంపిక చేశారు.
అయితే అశ్విన్ అనుభవానికే పెద్ద పీట వేస్తూ ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో అతణ్నే ఆడించింది జట్టు యాజమాన్యం. తొలి మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసిన అతను.. రెండో వన్డేలో స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్పై విజృంభించాడు. మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. లబుషేన్ను బౌల్డ్ చేసిన తీరుతో అశ్విన్ను ప్రపంచకప్కు ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. అక్షర్ మూడో వన్డే సమయానికి కూడా కోలుకోకపోవడంతో అశ్విన్ను అవకాశం వరించింది. రెండు వారాల ముందు జట్టు ప్రణాళికల్లోనే లేని వాడు ఇప్పుడు ప్రపంచకప్ ఆడబోతున్నాడు. ముందు ప్రపంచకప్నకు ఎంపిక చేసిన ముగ్గురు స్పిన్నర్లూ ఎడమ చేతి వాటం బౌలర్లే కాగా.. అక్షర్ బదులు కుడిచేతి వాటం బౌలరైన అశ్విన్ రావడంతో బౌలింగ్కు వైవిధ్యం చేకూరుతోంది. మంచి లయలో కనిపిస్తున్న అశ్విన్.. తన అనుభవాన్ని సరిగ్గా ఉపయోగిస్తే జట్టుకు పెద్ద బలమవుతాడనడంలో సందేహం లేదు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్