Ashwin- WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడకపోవడంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో (WTC Final 2023) అశ్విన్ ఆడించకపోవడంపై విమర్శలు వచ్చాయి. అశ్విన్ కూడా అప్పుడే స్పందించాడు. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో (WI vs IND) జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్తో అదరగొట్టాడు. కెరీర్లో 33వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో విండీస్ 150 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. నెల రోజుల కిందట ఆసీస్తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడే అవకాశం అశ్విన్కు రాలేదు. అప్పుడే ఆ అంశంపై అశ్విన్ స్పందించాడు. తాజాగా మరోసారి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘నేను ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి స్పందించాను. కీలకమైన మ్యాచ్కు పక్కన కూర్చోవడం ఎలాంటి క్రికెటర్కైనా కష్టంగానే ఉంటుంది. అయితే, ఇతరులకు నాకు మధ్య ఓ తేడా ఉంది. నేను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లకపోవడం, ఆటగాళ్లకు దూరంగా ఉండటం వంటివి చేయలేదు. మేం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లాండ్కు వెళ్లినప్పుడు మానసికంగానూ సిద్ధమై ఉన్నా. ఫిట్నెస్పరంగానూ ప్రిపేర్డ్గా ఉన్నా. మ్యాచ్లో ఎలా ఆడాలి.. ఎలా బౌలింగ్ చేయాలనేదాని గురించి ఆలోచించా. ఇదే సమయంలో మ్యాచ్లో నేను ఆడలేకపోతే అన్నదానికీ సిద్ధమయ్యా. టీమ్ఇండియా కోసం సర్వశక్తులూ వడ్డేందుకు ఎప్పుడూ రెడీ ఉంటా. సహచరులతో కలిసి ఆడేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. కాబట్టే ఆ విషయాన్ని అప్పుడే వదిలేశా’’ అని అశ్విన్ వివరించాడు.
వికెట్ నుంచి పూర్తి సహకారం
డొమినికా పిచ్ నుంచి బౌలింగ్కు పూర్తి సహకారం అందిందని అశ్విన్ తెలిపాడు. ‘‘వికెట్ నుంచి కొంత బౌన్స్ కలిసొచ్చింది. పెవిలియన్ ఎండ్ నుంచైతే బౌలర్లకు సహకారం లభించింది. తొలి సెషన్లోనే మేం బాగా వినియోగించుకున్నాం. తొలుత కాస్త తేమగా అనిపించినప్పటికీ స్పిన్కు అనుకూలంగా మారింది’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.