Ambati Rayudu: నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్లో చెన్నై, ముంబయి జట్లలో ఉండే సంస్కృతిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. రెండు ఫ్రాంచైజీల తరఫున రాయుడు ఆడిన సంగతి తెలిసిందే. ‘ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది’ అని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. దీంతో అంబటి రాయుడు వాటిపై వివరణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు.
‘‘ముంబయి గురించి నేను చేసిన కామెంట్లు పక్కదారి పట్టినట్లు అనిపించింది. ముంబయి ఫ్రాంచైజీ నడుచుకునే విధానం విభిన్నంగా ఉంటుందని మాత్రమే చెప్పా. పాజిటివ్ ఒత్తిడితో ఆటగాళ్లను తయారుచేయడంలో ఆ జట్టు కీలకంగా మారంది. భారత జట్టుకు అద్భుతమైన క్రికెటర్లు అక్కడినుంచీ ఉన్నారు. నేను ఎనిమిదేళ్లపాటు ముంబయి ఇండియన్స్తో ప్రయాణించా. ఆ విషయంలో ఇప్పటికీ గర్వపడుతుంటా’’ అని ఎక్స్లో పోస్టు చేశాడు.
గతంలో ఏమన్నాడంటే?
‘‘ఫలితాల్ని చెన్నై ఎక్కువగా విశ్లేషించదు. ప్రక్రియపై దృష్టిసారిస్తుంది. ఫలితాలపై మానసికంగా ఆందోళన చెందదు. ఈవిషయంలో ముంబయి పూర్తిగా భిన్నం. గెలుపే ఆ జట్టు లక్ష్యం. ముంబయి సంస్కృతి విజయాలపైనే ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా గెలవాల్సిందే.. ఆ విషయంలో రాజీపడొద్దని అనుకుంటుంది. చెన్నై, ముంబయి జట్ల సంస్కృతి పూర్తిగా భిన్నం. కానీ రెండు జట్లు బాగా కష్టపడతాయి. చెన్నై జట్టులో కాస్త మెరుగైన వాతావరణం ఉంటుందన్నది నా అభిప్రాయం. అక్కడ సుదీర్ఘకాలం ఆడొచ్చు. ముంబయి జట్టుకు ఎక్కువకాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది.
అసలా రోజు కామెంటరీ చేయలేదు..
లఖ్నవూతో సొంత మైదానంలో భారీ స్కోరు చేసినా ఓడిపోవడానికి కెప్టెన్ రుతురాజ్ పేలవ సారథ్యమే కారణమని రాయుడు విమర్శలు చేశాడని వార్తలు వచ్చాయి. దీంతో రాయుడికి భారత మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ కౌంటర్ ఇస్తూ.. ‘‘చెన్నై విజయాల్లో ధోనీకి క్రెడిట్ ఇస్తున్నప్పుడు.. ఆ జట్టు ఓటములకు కూడా అతడిని బాధ్యుడిని చేయడంలో తప్పేం లేదు. ఇప్పటికీ సీఎస్కేలో ప్రధాన పాత్ర ధోనీదే’’ అని వ్యాఖ్యాంచినట్లు రూమర్లు వచ్చాయి. వీటిపై రాయుడు క్లారిటీ ఇచ్చాడు. ‘‘ఆ రోజు నేనేమీ కామెంటేటరీ చేయలేదు. నా తోటలో మామిడి కాయలు కోసుకుంటున్నా. దయచేసి ఇలాంటివి ప్రచురించే ముందు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. అబద్ధాలను ప్రచారం చేయొద్దు’’ అని స్పష్టం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం