IPL 2024: ‘ఈ సాలా కప్ ఆర్సీబీదే’.. అంటున్న టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్
ఐపీఎల్-2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఛాంపియన్గా నిలుస్తుందని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. ఇప్పుడు క్రికెట్ అభిమానుల చూపు ఐపీఎల్-2024 (IPL 2024)పై పడింది. మార్చి 22 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు తమ జట్లతో కలిసి ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. స్టార్ ఆటగాళ్లు, కోట్లాది అభిమానగణం ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈ సీజన్తో ఆర్సీబీ (RCB) టైటిల్ కల నెరవేరుతుందని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) జోస్యం చెప్పాడు. ఓ క్రీడా ఛానల్లో ఆ జట్టు గురించి మాట్లాడాడు.
‘‘గతంలో కంటే ఈ సారి బెంగళూరు బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా ఉంది. చిన్నస్వామి వంటి ప్లాట్ పిచ్లపై ఎక్స్ప్రెస్ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. ఇలాంటి పిచ్లపై నిలకడగా 140 కి.మీ.కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తే అది కొన్నిసార్లు జట్టుకు ఉపకరిస్తుంది. ఈ సారి బెంగళూరు టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నా. అదే జరిగితే విరాట్ కోహ్లీకి ఇది చాలా స్పెషల్ మూమెంట్. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని అతడు 2008 నుంచి ఎదురుచూస్తున్నాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. మార్చి 22న జరిగే ఐపీఎల్-2024 సీజన్ ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి