Shreyanka Patil: మ్యాచ్‌ మధ్యలో మహిళా క్రికెటర్‌కు మ్యారేజ్‌ ప్రపోజల్‌.. ఫొటో వైరల్‌

డబ్ల్యూపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌తో ఆర్‌సీబీ తలపడుతున్న సమయంలో క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌కు ఓ అభిమాని మ్యారేజ్‌ ప్రపోజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.

Published : 28 Feb 2024 15:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) ఆసక్తికరంగా సాగుతోంది. గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (GG vs RCB) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ జరుగుతుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకొంది. బెంగళూరు క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌ (Shreyanka Patil)కి ఓ అభిమాని మ్యారేజ్‌ ప్రపోజల్‌ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది.

విజిటర్‌ గ్యాలరీలో కూర్చున్న శ్రేయాంక అభిమాని ఒకరు ‘విల్‌ యూ మేరీ మీ శ్రేయాంక పాటిల్‌’ అని రాసిన ఫ్లకార్డును ప్రదర్శించాడు. దీంతో స్టేడియంలోని కెమెరాలన్నీ అటువైపు తిరిగాయి. పెద్ద స్క్రీన్లలో ఆ దృశ్యాలు రావడంతో వాటిని చూసిన ప్లేయర్స్‌ నవ్వుకున్నారు. శ్రేయాంక మాత్రం స్పందించలేదు. ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పలువురు అభిమానులు ‘ఇదో పబ్లిసిటీ స్టంట్‌..’ ‘నీ పనేంటో చూసుకోవచ్చు కదా బ్రదర్...’’ అంటూ కామెంట్లు పోస్టు చేశారు.

లండన్‌కు మరో స్టార్ ప్లేయర్.. ఐదో టెస్టులో ఆడటం అనుమానమే?

చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ స్మృతీ మంధాన (43), సబ్బినేని మేఘన (35*), ఎల్సీ పెర్రీ (23*) రాణించడంతో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 12.3 ఓవర్లలో చేధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని