RCB vs GT: కొనసాగుతున్న వర్షం.. గుజరాత్ X బెంగళూరు మ్యాచ్ టాస్ ఆలస్యం
బెంగళూరులో వర్షం పడుతుండటం ఆర్సీబీ (RCB) అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. గుజరాత్పై గెలిచి ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్దామనే ఆశలకు అడ్డుకట్టపడేలా ఉందని వాపోతున్నారు. మ్యాచ్ సమయానికి (రాత్రి 7. 30 గంటలకు) వర్షం ఆగాలని కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్లో తమ చివరి లీగ్ మ్యాచ్ను ఆడేందుకు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే బెంగళూరులో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఆ తర్వాత వర్షం తగ్గినా... ప్రస్తుతం జల్లులు పడుతున్నాయి. దీంతో టాస్ ఆలస్యం అవుతుందని ఐపీఎల్ టీమ్ ట్వీట్ చేసింది.
గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరుకోగా, బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం. ఇందులో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. అయితే బెంగళూరులో వర్షం కురుస్తుండటంతో ప్లేఆఫ్స్ అవకాశాల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
• వర్షం లేకుండా.. మ్యాచ్ జరిగితే గుజరాత్పై బెంగళూరు విజయం సాధించాలి. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్రేట్ కారణంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది.
• వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే.. గుజరాత్ (18 పాయింట్లు), బెంగళూరు (14 పాయింట్లు) జట్లకు చెరొక పాయింట్ వచ్చి చేరుతుంది. అప్పుడు గుజరాత్ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. దీంతో ఆ జట్టుదే అగ్రస్థానం. ఇక బెంగళూరు పాయింట్ల సంఖ్య 15కి చేరుతుంది.
• ప్రస్తుతం హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి (14 పాయింట్లు) ఓడిపోతేనే బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుంది. అలా కాకుండా ముంబయి గెలిస్తే 16 పాయింట్లతో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.
• దీంతో రాజస్థాన్ (14 పాయింట్లు) ఆశలు కూడా అడుగంటిపోతాయి. ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే మెరుగైన రన్రేట్ కారణంగా ప్లేఆఫ్స్లోకి వెళ్లొచ్చని ఆశపడుతున్న రాజస్థాన్కు నిరాశే మిగులుతుంది.
ఆర్సీబీలో నా పాత్ర రెండు విధాలు: డుప్లెసిస్
‘‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో నా పాత్ర రెండు విధాలుగా ఉంటుంది. బ్యాటర్గా నా అనుభవంతో జట్టుకు సహకారం అందించడం.. ఇక సారథిగా తండ్రి పాత్రను పోషించాల్సి ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ యువ క్రికెటర్లలోని టాలెంట్ను బయటకు తీసుకురావాలి’’ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు.
ఆ ఇద్దరు ఎదురుపడితే: హర్భజన్
లీగ్ స్టేజ్లో గౌతమ్ గంభీర్ - విరాట్ కోహ్లీల మధ్య వాగ్వాదం చేసుకున్న సంఘటన తర్వాత ఇరు జట్ల మధ్య ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లిన లఖ్నవూ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ బెంగళూరు చివరి మ్యాచ్లో గెలిస్తే నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ ఆడే అవకాశం ఉంది. అప్పుడు మరోసారి లఖ్నవూ, బెంగళూరు తలపడతాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ... ‘‘ఈసారి విరాట్, గంభీర్ ఎదురైతే.. ఇరువురూ వాగ్వాదం చేసుకోరని అనిపిస్తోంది. అయితే, నాకు ఇప్పుడే అదే ఆందోళనగానూ ఉంది’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...