RCB vs GT: కొనసాగుతున్న వర్షం.. గుజరాత్ X బెంగళూరు మ్యాచ్ టాస్ ఆలస్యం
బెంగళూరులో వర్షం పడుతుండటం ఆర్సీబీ (RCB) అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. గుజరాత్పై గెలిచి ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్దామనే ఆశలకు అడ్డుకట్టపడేలా ఉందని వాపోతున్నారు. మ్యాచ్ సమయానికి (రాత్రి 7. 30 గంటలకు) వర్షం ఆగాలని కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్లో తమ చివరి లీగ్ మ్యాచ్ను ఆడేందుకు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే బెంగళూరులో మధ్యాహ్నం భారీ వర్షం కురియడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఆ తర్వాత వర్షం తగ్గినా... ప్రస్తుతం జల్లులు పడుతున్నాయి. దీంతో టాస్ ఆలస్యం అవుతుందని ఐపీఎల్ టీమ్ ట్వీట్ చేసింది.
గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరుకోగా, బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం. ఇందులో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. అయితే బెంగళూరులో వర్షం కురుస్తుండటంతో ప్లేఆఫ్స్ అవకాశాల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
• వర్షం లేకుండా.. మ్యాచ్ జరిగితే గుజరాత్పై బెంగళూరు విజయం సాధించాలి. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్రేట్ కారణంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది.
• వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే.. గుజరాత్ (18 పాయింట్లు), బెంగళూరు (14 పాయింట్లు) జట్లకు చెరొక పాయింట్ వచ్చి చేరుతుంది. అప్పుడు గుజరాత్ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. దీంతో ఆ జట్టుదే అగ్రస్థానం. ఇక బెంగళూరు పాయింట్ల సంఖ్య 15కి చేరుతుంది.
• ప్రస్తుతం హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబయి (14 పాయింట్లు) ఓడిపోతేనే బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుంది. అలా కాకుండా ముంబయి గెలిస్తే 16 పాయింట్లతో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.
• దీంతో రాజస్థాన్ (14 పాయింట్లు) ఆశలు కూడా అడుగంటిపోతాయి. ముంబయి, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే మెరుగైన రన్రేట్ కారణంగా ప్లేఆఫ్స్లోకి వెళ్లొచ్చని ఆశపడుతున్న రాజస్థాన్కు నిరాశే మిగులుతుంది.
ఆర్సీబీలో నా పాత్ర రెండు విధాలు: డుప్లెసిస్
‘‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో నా పాత్ర రెండు విధాలుగా ఉంటుంది. బ్యాటర్గా నా అనుభవంతో జట్టుకు సహకారం అందించడం.. ఇక సారథిగా తండ్రి పాత్రను పోషించాల్సి ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ యువ క్రికెటర్లలోని టాలెంట్ను బయటకు తీసుకురావాలి’’ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు.
ఆ ఇద్దరు ఎదురుపడితే: హర్భజన్
లీగ్ స్టేజ్లో గౌతమ్ గంభీర్ - విరాట్ కోహ్లీల మధ్య వాగ్వాదం చేసుకున్న సంఘటన తర్వాత ఇరు జట్ల మధ్య ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లిన లఖ్నవూ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ బెంగళూరు చివరి మ్యాచ్లో గెలిస్తే నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ ఆడే అవకాశం ఉంది. అప్పుడు మరోసారి లఖ్నవూ, బెంగళూరు తలపడతాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ... ‘‘ఈసారి విరాట్, గంభీర్ ఎదురైతే.. ఇరువురూ వాగ్వాదం చేసుకోరని అనిపిస్తోంది. అయితే, నాకు ఇప్పుడే అదే ఆందోళనగానూ ఉంది’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్