world cup 2023: మైదానంలో నిశ్శబ్దానికి కారణాలెన్నో..!
కోహ్లీ, రోహిత్ సర్వశక్తులు ఒడ్డినా.. బుమ్రా, షమీలు శ్రమను ధారపోసినా.. భారత్కు మూడోసారి ప్రపంచకప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 11 మంది సమష్టిగా ఆడే ఆటలో ఏ ఒక్కరి ప్రతిభతోనే టోర్నీలు సాధించడం అసాధ్యమని భారత్కు మరోసారి ఈ ఓటమి తెలియజేసింది.
బ్యాటింగ్ వైఫల్యాలకు దారుణమైన ఫీల్డింగ్ తోడు కావడంతో భారత్ ప్రపంచకప్ను చేజార్చుకుందనే చెప్పాలి. టాస్, పిచ్, వాతావరణం వంటి వాటిని కారణాలుగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఏమ్యాచ్లోనూ వాటిలో మార్పు చేసుకోవడం జట్టు చేతిలో ఉండదు. కానీ, వాటిని అర్థం చేసుకుంటూ.. దానికి తగినట్లు సిద్ధం కావడం మాత్రం ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంటుంది. అన్నింటికి మించి ఎదురుదెబ్బలను తట్టుకొని తుదివరకు పోరాడే తత్వం లోపించిందనిపించింది.
డైవ్ చేయడం మర్చిపోయినట్లున్నారు..
ఫీల్డింగ్లో డైవింగ్ అనేది ఒకటి ఉంటుందని భారత ఆటగాళ్లు మర్చిపోయినట్లున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బౌండరీ లైన్కు కొన్ని అంగుళాల దూరంలో డైవ్ చేసి మరీ బంతిని ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 37 ఏళ్ల వార్నర్ బౌండరీ లైన్ వద్ద అడ్డంగా గోడ కట్టారా అన్నట్లు ఫీల్డింగ్ చేశాడు. ఆసీస్ ఈ రకంగా కనీసం 40 పరుగులను భారత్ నుంచి లాక్కొని ఉంటుంది. ఇది మన ఇన్నింగ్స్పై పెను ప్రభావం చూపింది. ఇక 11 నుంచి 50 ఓవర్ మధ్యలో కేవలం నాలుగు బౌండరీలనే ఇచ్చారంటే.. ఆసీస్ ఫీల్డర్ల నుంచి బౌలర్లకు లభించిన సహకారాన్ని అర్థం చేసుకోవచ్చు. 1999 నుంచి ఒక వన్డే మ్యాచ్లో 10వ ఓవర్ తర్వాత భారత్ కొట్టిన అత్యల్ప బౌండరీలు ఇవే. వీటిల్లో ప్రధాన బ్యాటర్లు కాకుండా టెయిలెండర్లైన షమి, సిరాజ్ కొట్టినవి రెండు ఉన్నాయి.
ఇక భారత్ ఫీల్డింగ్లో డైవ్ చేసిన సందర్భాలు కేవలం ఒకట్రెండు ఉంటాయి. చాలా సార్లు మన ఫీల్డర్లు డైవ్ చేయాల్సిన చోట కూడా బంతితోపాటు బౌండరీని దాటేస్తున్నారు. ఇలాంటి ఫీల్డింగ్కుతోడు 18 పరుగులను ఎక్స్ట్రాల రూపంలో సమర్పించుకొన్నారు.
బ్యాటర్లపై పనిచేసిన ఒత్తిడి..
భారత బ్యాటర్లు ఫైనల్ ఒత్తిడిని తట్టుకోలేకపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జట్టును వీలైనంత సౌకర్యవంతమైన స్థానంలో ఉంచేందుకు రోహత్ సహజశైలిలో ఎదురుదాడికి దిగాడు. మరోవైపు నిలకడగా ఆడాల్సిన గిల్ చెత్తషాట్కు యత్నించి వికెట్ సమర్పించుకొన్నాడు. వాస్తవానికి గిల్కు ఈ మైదానం కొత్తేమీకాదు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపు ఆడే అతడికి ఇది హోం గ్రౌండ్ వంటిది.
మరోవైపు రోహిత్ దాడి ఫలితం చూపించడంతో..పది ఓవర్లుకు ఎనిమిది రన్రేట్తో 80 పరుగులు చేయగలిగింది. ఇక రోహిత్ ఔట్ తర్వాత బరిలోకి దిగిన శ్రేయస్ రిస్క్తో కూడిన బంతిని కదిలించి వికెట్ సమర్పించుకొన్నాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించినట్లు కనిపించలేదు. దీంతో ఇన్నింగ్స్కు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత కోహ్లీ, రాహుల్పై పడింది. మరో వికెట్ పడకుండా స్కోరును 148 వద్దకు చేర్చారు. కానీ, బౌండరీలు రావడం గగనమై.. స్కోర్ వేగం మందగించింది.
ముఖ్యంగా ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో భారత్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ మ్యాచ్లో స్టార్క్, హేజిల్వుడ్ వంటి సీమర్లు 20 ఓవర్లలో 115 పరుగులు ఇస్తే.. మ్యాక్స్వెల్, జంపా, హెడ్ కలిపి 18 ఓవర్లు వేసి కేవలం 85 పరుగులు ఇవ్వడం గమనార్హం.
సూర్యా ఇదేంటయ్యా..!
28 బంతులకు 18 పరుగులు. ఇతడా ప్రపంచంలోనే నంబర్ 1 టీ20 బ్యాటర్..! ప్రపంచకప్ టోర్నీ మొత్తంలో మిస్టర్ 360కి బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాలేదు. కానీ, తనను తాను నిరూపించుకోవడానికి ప్రపంచకప్ ఫైనల్ రూపంలో అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. ఫినిషర్గా ఇన్నింగ్స్ను ముగిస్తాడని 7వ స్థానంలో బ్యాటింగ్కు పంపారు. అతడు బ్యాటింగ్కు వచ్చే సమయానికి దాదాపు 10 ఓవర్లు మిగిలి ఉన్నాయి.
అతడి తర్వాత మొత్తం టెయిలెండర్లే. వారు ఆసీస్ బౌలర్లకు ఎరకాకుండా తాను స్ట్రైకింగ్లో ముందుండి ఎదురు దాడి చేయాల్సిన సమయంలో కేవలం సింగిల్స్ తీసి టెయిలెండర్లకు స్ట్రైకింగ్ ఇస్తూ కాలయాపన చేశాడు. అసలు అతడు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడుతున్నట్లే అనిపించలేదు. అతడి వైఫల్యంలో పిచ్ను నిందించడానికి ఏమీలేదు.. అదే పిచ్పై అంతకు ముందు రోహిత్ శరవేగంగా 47 బాదాడన్న విషయం మర్చిపోయినట్లు కనిపించింది. ఆ తర్వాత లబుషేన్, హెడ్లు భారీ స్కోర్లు చేశారు.
ఓ పక్క హేజల్వుడ్ సూర్యాకు స్లో షార్ట్పిచ్ బాల్ రూపంలో ఉచ్చు పన్నిన విషయం కూడా అర్థం చేసుకోలేకపోయాడు. అంతకు ముందే అలాంటి బంతికే ఔటైనంత పనైంది. కొంచెం మార్పులతో హేజిల్వుడ్ సంధించిన తర్వాతి బంతికి అలాంటి షాటే ప్రయత్నించి వికెట్ సమర్పించుకొని పెవిలియన్కు చేరుకొన్నాడు.
పోరాడే తత్వం ఏదీ..
వాస్తవానికి టీమ్ ఇండియాతో పోలిస్తే ఆస్ట్రేలియా ఆరంభమే అత్యంత దారుణంగా ఉంది. మనం 10.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేస్తే.. ఆసీస్ 6.6 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. కానీ, లక్ష్యం, మారుతున్న పిచ్ను సరిగ్గా అంచనా వేసి ట్రావిస్ హెడ్, లబూషేన్.. ఏమాత్రం తొందరపడకుండా నిలకడగా స్కోర్బోర్డును ముందుకు నడిపించారు. గతంలో అఫ్గానిస్థాన్పై, దక్షిణాఫ్రికాపై ఆసీస్ క్రీడాకారులు ఇలాంటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు.
భారత్ 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్, 2022 టీ20 సెమీస్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్స్.. తాజాగా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్ ఓటమికి ఆటగాళ్ల ప్రతిభా లోపం కారణం కాదు. కేవలం నాకౌట్స్లో ఉండే ఒత్తిడే కారణంగా నిలుస్తోంది. భారత్ ఈ ఒక్క లోపాన్ని సరిదిద్దుకొంటే భవిష్యత్తులో మైదానంలో అభిమానుల కేరింతలు చూడొచ్చు.
- ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!