ODI WORLD CUP 2023: వన్డే ప్రపంచకప్.. రికార్డుల కప్..
భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) రికార్డుల మోత మోగుతోంది. అవును.. ఈ మెగా టోర్నీ ఇప్పుడు కొత్త రికార్డులకు వేదికగా నిలుస్తోంది.
పరుగుల వరద పారుతోంది.. సెంచరీల జోరు కొనసాగుతోంది.. వికెట్ల వేట హోరెత్తిస్తోంది.. మొత్తంగా భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్లో రికార్డుల మోత మోగుతోంది. అవును.. ఈ మెగా టోర్నీ ఇప్పుడు కొత్త రికార్డులకు వేదికగా నిలుస్తోంది. ప్రపంచకప్ ఆరంభమై పది రోజులు గడిచింది. 12 మ్యాచ్లు మాత్రమే పూర్తయ్యాయి. కానీ రికార్డులు మాత్రం ఊహించని స్థాయిలో బద్దలవుతున్నాయి. ఆరంభ మ్యాచ్ మొదలు.. భారత్- పాక్ పోరు వరకూ దాదాపు అన్ని మ్యాచ్ల్లోనూ ఏదో ఒక కొత్త రికార్డు నమోదైందనే చెప్పాలి. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోరు, అత్యధిక ఛేదన రికార్డులు ఇప్పటికే ఆవిష్క్రతమయ్యాయి. ప్రపంచకప్లో సత్తాచాటాలనే ఉద్దేశంతో అన్ని జట్లు బరిలో దిగడం.. అత్యుత్తమ ఆటతీరుతో రాణించేందుకు ఆటగాళ్లు కసితో ఉండటంతో రికార్డుల మోత మోగుతోంది.
ఆరంభమే అదుర్స్..
ప్రపంచకప్ ఆరంభమే అదుర్స్ అని చెప్పాలి. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో 2019 ఛాంపియన్ ఇంగ్లాండ్తో అప్పటి రన్నరప్ న్యూజిలాండ్ తలపడింది. మొదట ఇంగ్లాండ్ 282/9 స్కోరుకే పరిమితమైంది. అయితే ఆ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాటర్లందరూ రెండంకెల స్కోరు సాధించారు. వన్డే చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్లో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు చేయడం ఇదే తొలిసారి. ఛేదనలో కాన్వే, రచిన్ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్ అలవోకగా విజయాన్ని అందుకుంది. అయితే ఈ క్రమంలో అభేద్యమైన రెండో వికెట్కు 273 పరుగులు జోడించిన కాన్వే- రచిన్.. ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్ తరపున ఏ వికెట్కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేశారు. అలాగే రచిన్ ప్రపంచకప్ అరంగేట్రంలో శతకం సాధించిన అతి పిన్న వయస్సు (23 ఏళ్ల 321 రోజులు) కివీస్ ఆటగాడిగా నిలిచాడు. అంతే కాకుండా 82 బంతుల్లోనే సెంచరీ చేసిన అతను.. న్యూజిలాండ్ తరపున ప్రపంచకప్లో అత్యంత వేగంగా శతకం చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అనంతరం శ్రీలంకపై చెలరేగిన దక్షిణాఫ్రికా కొత్త చరిత్ర సృష్టించింది. ఆ జట్టులో డికాక్, వాండర్డసెన్, మార్క్రమ్ సెంచరీలు బాదడంతో ఆ జట్టు ఏకంగా 428/5 స్కోరు చేసింది. ప్రపంచకప్ చరిత్రలోనే ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఆస్ట్రేలియా (2015లో అఫ్గానిస్థాన్పై 417/7) రికార్డును దక్షిణాఫ్రికా తిరగరాసింది. అలాగే ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో మూడు శతకాలు నమోదవడం కూడా ఇదే మొదటిసారి. 49 బంతుల్లోనే సెంచరీ అందుకున్న మార్క్రమ్.. ప్రపంచకప్ల్లో అత్యంత వేగవంతమైన శతకం రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
మన జట్టు..
ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకూ టీమ్ఇండియా ఆటగాళ్లు కూడా కొన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడింది. అయితే ఈ మ్యాచ్లో వద్దనుకునే ఓ రికార్డును భారత్ సాధించింది. ఓ వన్డే మ్యాచ్లో భారత టాప్-4 ఆటగాళ్లలో ముగ్గురు డకౌటవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో ఇషాన్, రోహిత్, శ్రేయస్ సున్నాకే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లోనే ఆసీస్ ఓపెనర్ వార్నర్.. ప్రపంచకప్లో తక్కువ ఇన్నింగ్స్ (19)ల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా సచిన్, డివిలియర్స్ (20)ను వెనక్కినెట్టాడు. మరో వైపు పేసర్ స్టార్క్ ప్రపంచకప్ల్లో తక్కువ ఇన్నింగ్స్ (19)ల్లో 50 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇక అఫ్గాన్పై భారీ విజయంతో పాటు కొన్ని రికార్డులను భారత్ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. ప్రపంచకప్ల్లో అత్యధిక శతకాలు (7) చేసిన ఆటగాడిగా సచిన్ (6)ను వెనక్కినెట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ (553)నూ రోహిత్ అధిగమించాడు. ప్రపంచకప్లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ (63 బంతుల్లో) రికార్డునూ సొంతం చేసుకున్నాడు. అలాగే ప్రపంచకప్ల్లో తక్కువ ఇన్నింగ్స్ (19)లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా వార్నర్ సరసన రోహిత్ నిలిచాడు. ఇక పాక్తో మ్యాచ్తో వన్డేల్లో 300కు పైగా సిక్సర్లు కొట్టిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. 157 వికెట్లతో ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఎడమ చేతి వాటం మణికట్టు స్పిన్నర్గా కుల్దీప్ ఘనత సాధించాడు.
మన ఉప్పల్లో..
ఈ ప్రపంచకప్లో ఉప్పల్లో జరిగిన మ్యాచ్ల్లోనూ రికార్డుల వెల్లువ కొనసాగింది. నెదర్లాండ్స్తో న్యూజిలాండ్ మ్యాచ్లో కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఓ రికార్డు అందుకున్నాడు. ఉప్పల్ స్టేడియంలో వన్డేలో అయిదు వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు. ఇదే వేదికలో జరిగిన శ్రీలంక- పాక్ పోరులోనూ ఓ ప్రతిష్ఠాత్మక రికార్డు బద్దలైంది. లంకపై పాక్ 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్లో ఇదే అత్యధిక ఛేదన. 2011లో ఇంగ్లాండ్పై 328 పరుగుల ఛేదనతో ఐర్లాండ్ నెలకొల్పిన రికార్డును పాక్ తిరగరాసింది. ఈ మ్యాచ్లో శతకం చేసిన అబ్దుల్లా షఫీˆక్.. ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్లో సెంచరీ చేసిన తొలి పాక్ ఆటగాడిగా నిలిచాడు. ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఈ ప్రపంచకప్లో ఇంకా అనేక మ్యాచ్లు మిగిలి ఉండటంతో మరెన్నో కొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమేనని చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు