Jay Shah: బీసీసీఐ కార్యదర్శి జై షాకి ఐసీసీలో కీలక పదవి!
ఐసీసీకి మరోసారి ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షాకి కీలక పదవి లభిస్తున్నట్లు సమాచారం. అయితే వచ్చేవారం జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షాకి మరో కీలక పదవి దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కావడం గమనార్హం. ఐసీసీ ఆర్థిక, వాణిజ్య అఫైర్స్ కమిటీకి చీఫ్గా జై షా నియమితులు కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారికంగా ఐసీసీ వెల్లడించాల్సి ఉంది. ఐసీసీ ఈవెంట్స్ కోసం అవసరమైన నిధుల కేటాయింపు, బడ్జెట్ను నిర్ణయించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది.
ఐర్లాండ్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రాస్ మెక్కల్లమ్ ప్రస్తుతం కమిటీకి చీఫ్గా వ్యవరిస్తున్నారు. ఆయన త్వరలో రిటైర్ కాబోతున్నారు. దీంతో రాస్ స్థానంలో జై షా పదవిని అందుకొంటారు. మార్చి 2023లో కమిటీ సమావేశం జై షా అధ్యక్షతన జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా వచ్చేవారం జరిగే ఐసీసీ బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు బీసీసీఐ తరఫున జై షా, భారత టీ20 లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకొన్నారు. ఐసీసీ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్థానంలో ఈసారి జై షా ఉంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం