Rishabh Pant: ఈసారి రిషభ్ పంత్పై మ్యాచ్ వేటు తప్పదా?
ఐపీఎల్ 17వ సీజన్లో రిషభ్ పంత్ చిక్కుల్లో పడేలా ఉన్నాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా మూడోసారి తప్పిదానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కెప్టెన్గా రిషభ్ పంత్ మాత్రమే రెండుసార్లు జరిమానాలు ఎదుర్కొన్నాడు. తొలిసారి రూ.12 లక్షలు, రెండోసారి ఏకంగా రూ.24 లక్షల ఫైన్ను ఈ దిల్లీ సారథి కట్టాడు. అదంతా స్లో ఓవర్రేట్ కారణంగా ఐపీఎల్ మేనేజ్మెంట్ విధించింది. తాజాగా లఖ్నవూతో జరిగిన మ్యాచ్ సమయంలోనూ మరోసారి స్లో ఓవర్రేట్తోపాటు అంపైర్తో వాగ్వాదం చేయడం పంత్కు తిప్పలు తెచ్చేలా ఉన్నాయి. లఖ్నవూ ఇన్నింగ్స్లో 16వ ఓవర్ నాటికి దిల్లీ నిర్దేశించిన సమయానికి ఓ ఓవర్ వెనకబడి ఉంది. దీంతో నిబంధనల ప్రకారం ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సర్కిల్ అవతల అయిదుగురికి బదులు కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే ఉంచాలి. లఖ్నవూ మ్యాచ్లోనూ దిల్లీకి ఇలానే జరిగింది. దీంతో ఐపీఎల్ నుంచి మరోసారి పంత్కు భారీ జరిమానాతోపాటు ఒక మ్యాచ్ నిషేధం రావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిబంధనలు ఇలా..
ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. తొలిసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి కెప్టెన్ రూ.12 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే పొరపాటును మళ్లీ చేస్తే రెట్టింపు జరిమానా అంటే రూ.24 లక్షలు చెల్లించాలి. ఇంపాక్ట్ ప్లేయర్తో సహా తుది జట్టులోని 11 మందికి రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్ ఫీజ్లో 25 శాతం ఏది తక్కువైతే అది.. ఫైన్గా విధించడం జరుగుతుంది. ఒకవేళ ఇదే సీజన్లో మూడోసారి తప్పిదానికి పాల్పడితే జరిమానా రూ.30 లక్షలతోపాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే ప్రమాదం లేకపోలేదు. పంత్ జరిమానాకు సంబంధించి ఇప్పటివరకు ఐపీఎల్ కమిటీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి