Rishabh Pant: మైదానంలో అడుగుపెట్టిన రిషభ్ పంత్.. గ్యాలరీ నుంచి స్టాండింగ్ ఒవేషన్
Rishabh Pant: రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెట్టిన దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్కు గ్యాలరీ నుంచి అభిమానులు చప్పట్లతో స్వాగతించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ రెండో మ్యాచ్లో పంజాబ్, దిల్లీ జట్లు తలపడ్డాయి. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో అందరి దృష్టి దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) పైనే. 15 నెలల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అతడికి అభిమానులు ఘన స్వాగతం పలికారు.
తొమ్మిదో ఓవర్లో వార్నర్ ఔట్ అయిన తర్వాత పంత్ బ్యాట్ పట్టుకొని క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియం అంతా అతడి పేరు మార్మోగింది. గ్యాలరీ నుంచి అభిమానులు లేచి నిల్చొని చప్పట్లతో ఆహ్వానించడంతో కొంతసేపు ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది.
2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ దాదాపు 450 రోజుల తర్వాత పోటీ క్రికెట్లో అడుగుపెట్టాడు. తీవ్రంగా గాయపడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న అతను సౌకర్యంగానే బ్యాటింగ్ చేశాడు. అయితే, నేటి మ్యాచ్లో పెద్దగా రాణించలేకపోయాడు. 13 బంతుల్లో 18 పరుగులతో తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన దిల్లీ 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. వార్నర్ (29), హోప్ (33), అభిషేక్ పొరెల్ (32*) రాణించగా.. మిచెల్ మార్ష్ (20), అక్షర్ పటేల్ (21) ఫర్వాలేదనిపించారు. హర్షల్ పటేల్, అర్ష్దీప్ చెరో 2, రబాడ, రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రర్ ఒక్కో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి