Rishabh Pant: పంత్ పునరాగమనం అంత సులభం కాదు: మాజీ వికెట్ కీపర్
ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ పునరాగమనం అంత సులభం కాదని భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ (Rishabh Pant) పునరాగమనం అంత సులభం కాదని భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel) అన్నాడు. 2022 డిసెంబరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ ఏడాది మొత్తం క్రికెట్కు దూరమై విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో మళ్లీ ఒకప్పటిలా ఆడాలంటే అంత సులువైన విషయం కాదన్నాడు. ‘‘పంత్ తిరిగి రావడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. అతనొక ప్రతిభ గల ఆటగాడు. ఎప్పుడు మైదానంలో అడుగుపెట్టినా జట్టును గెలిపించడానికే శ్రమిస్తాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడి కోలుకున్న పంత్ మళ్లీ మునుపటిలా సిక్సర్లు కొట్టడం మనందరం చూస్తామని ఆశిస్తున్నా. కానీ అది అంత సులభం కాదని మనందరికీ తెలిసిందే. చాలా కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్న ఆటగాడు తిరిగి పుంజుకోవాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా సిద్ధమవ్వాలి’’ అని పార్థివ్ అన్నాడు.
2022 డిసెంబరు 30న పంత్ కారులో ప్రయాణిస్తుండగా డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో కారుకు మంటలు అంటుకోవడంతో పాటు అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. దాని నుంచి బయటపడ్డ అతడు ఏడాదికాలంగా విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. చివరగా ఐపీఎల్ 2022 సీజన్లో దిల్లీ తరఫున ఆడిన రిషబ్ పంత్ 30.91 సగటుతో 340 పరుగులు చేశాడు. ఐపీఎల్లో మొత్తంలో 98 మ్యాచ్లు ఆడి 2,838 పరుగులు చేశాడు. 2024 సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్తో మొహాలీలో ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి