Rishbh Pant: కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో దిల్లీ మళ్లీ విజయాల బాట పట్టింది. గుజరాత్పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 43 బంతుల్లోనే 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. విధ్వంసం సృష్టించిన పంత్ ఓ వ్యక్తికి మాత్రం సారీ చెప్పడం గమనార్హం. ఇంతకీ అతడెవరంటే..? బీసీసీఐ కెమెరామెన్ దేబశిశ్. పంత్ కొట్టిన బంతి అతడికి తాకింది. దీంతో మ్యాచ్ అనంతరం పంత్ స్పందిస్తూ.. ‘‘సారీ దేబశిశ్ భాయ్. నిన్ను కొట్టాలనే ఉద్దేశం నాకు లేదు. వీలైనంత త్వరగా కోలుకుని వస్తావని ఆశిస్తున్నా’’ అని ఓ వీడియోలో వ్యాఖ్యానించాడు. దానిని ఐపీఎల్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. మ్యాచ్లో గెలవడంపై ఆనందం వ్యక్తం చేసిన పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘క్లిష్ట సమయంలో యువ బౌలర్ రసిక్కు 19వ ఓవర్ ఇవ్వడానికి కారణముంది. ఆన్రిచ్ నోకియా గత కొన్ని మ్యాచుల్లో ఇబ్బంది పడ్డాడు. అందుకే, రసిక్కు బంతినందించా. రెండో ఇన్నింగ్స్లో 15వ ఓవర్ తర్వాత నుంచి బ్యాటింగ్ చేయడం తేలికైంది. అందుకే రసిక్పై నమ్మకం ఉంచి బౌలింగ్ చేయించా. మ్యాచ్లో ఉత్తమ ప్రదర్శన చేస్తున్న వారిని మనం ప్రోత్సహించాలి.. కెప్టెన్గా అది నా బాధ్యత. కొన్నిసార్లు ఫలితం అనుకూలంగా రాకపోవచ్చు. గుజరాత్తో మాత్రం వర్కౌట్ కావడం ఆనందంగా ఉంది. మేం 44/3 స్కోరుతో ఉన్నప్పుడు వారి అత్యుత్తమ స్పిన్ విభాగంతో ఆడాల్సిన పరిస్థితి ఎదురైంది. స్ట్రైక్ను రొటేట్ చేస్తూ వారిని లక్ష్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వందశాతం నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తా. నేను కొట్టిన తొలి సిక్స్తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని పంత్ తెలిపాడు.
చివరి ఓవర్ వరకూ వచ్చిందంటే..: కుల్దీప్
‘‘కీలకమైన రెండు పాయింట్లు సాధించడం హ్యాపీగా ఉంది. టోర్నీలో ప్రతి మ్యాచ్ మాకు ముఖ్యమే. గుజరాత్తో చివరి ఓవర్ వరకూ మ్యాచ్ వెళ్లింది. రాహుల్ తెవాతియా బ్యాటింగ్కు వచ్చినప్పుడు ఒక ఓవర్ వేయాలని కెప్టెన్, కోచ్ సూచించారు. అతడిని ఔట్ చేయగలిగా. బ్యాటర్ను అర్థం చేసుకుని.. తగ్గట్టుగా బంతులేస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది. మా బ్యాటర్లు రాణించి 225 పరుగులను లక్ష్యంగా నిర్దేశించారు. మా ప్రణాళికల ప్రకారం బౌలింగ్ చేశాం. ప్రత్యర్థి దూకుడుగా ఆడినా ఎక్కడా కంగారు పడలేదు. చివరి రెండు ఓవర్లలో మేం కాస్త అధికంగానే పరుగులు ఇచ్చాం. వారిని 210లోపే కట్టడి చేస్తామని భావించాం’’ అని కుల్దీప్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం