Riyan Parag: ప్రపంచ కప్ను చూడాలని లేదు..: రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
తనకు జాతీయ జట్టులో స్థానం దక్కలేదని రియాన్ పరాగ్ అసంతృప్తిని తెలిపే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసి నెట్టింట విమర్శలకు గురవుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో ప్రారంభమైన మ్యాచ్లు జరుగుతున్నాయి. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ను జూన్ 5న ఐర్లాండ్తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి జోష్ మీదుంది. అయితే, జట్టుకు ఎంపిక కాని రియాన్ పరాగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు వరల్డ్ కప్ కోసం తీసుకుంటారనే చర్చ వచ్చింది. కానీ, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడిని ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో తనకు ఈసారి వరల్డ్ కప్పై ఆసక్తి లేదని పరాగ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
‘‘నేను వరల్డ్ కప్ జట్టులో ఉండుంటే.. ఏమమవుతుందనే కంగారు ఉండేది. కానీ, ఇప్పుడీ టీమ్లో లేను. కాబట్టి నాకు పెద్దగా ఆసక్తి లేదు. చాలా మంది టాప్-4లో ఎవరు ఉంటారనే దానిపై చర్చిస్తున్నారు. ఇప్పుడే సమాధానం చెబితే కొన్ని జట్లపై పక్షపాతం చూపించినట్లు అవుతుంది. నిజాయతీగా చెప్పాలంటే.. అసలు ఈసారి వరల్డ్ కప్ను చూడాలని కూడా నాకు లేదు. చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోష పడతా. నేను ఒకవేళ జట్టులో ఉంటే.. అప్పుడేమైనా టాప్ -4 టీమ్లు గురించి ఆలోచించేవాడినేమో. మైదానంలో విరాట్ కోహ్లీ చూపించే జోష్ను ఎవరూ అందుకోలేరు’’ అని పరాగ్ తెలిపాడు.
ఈ యువ బ్యాటర్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురయ్యాడు. గతేడాది ఐపీఎల్లో పెద్దగా రాణించకపోయినా.. తన ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలిచేవాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 17వ సీజన్లో నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందాడు. కానీ, మళ్లీ తన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కోవడం మొదలైంది. జాతీయ జట్టులోకి రావడంపైనా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘ఏదో ఒక సమయంలో నన్ను తీసుకొనే పరిస్థితి వస్తుంది. తప్పకుండా భారత జట్టు కోసం ఆడతాననే నమ్మకం ఉంది. అదెప్పుడు అనేది నాకు తెలియదు’’ అని పరాగ్ చెప్పాడు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి కామెంట్లతో నెట్టింట వైరల్గా మారాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?