Riyan: అలా ట్వీట్లు చేసే బదులు.. నాకే మెసేజ్ చేయొచ్చు కదా..: రియాన్ పరాగ్
తనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించిన క్రికెట్ విశ్లేషకులపై రియాన్ పరాగ్ (Riyan Parag) స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో విమర్శలు ఎదుర్కొన్న యువ ఆటగాళ్లలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఒకడు. సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో గతంలో అతడు చేసిన వాటిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యాడు. నాలుగేళ్ల కిందట ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన రియాన్.. ఇటీవల ముగిసిన సీజన్లో ఏడు మ్యాచుల్లో కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో క్రికెట్ విశ్లేషకులు కూడా రియాన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు వాటిపై రియాన్ పరాగ్ స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన ట్విటర్లో పోస్టు చేసింది.
వీడియో ప్రారంభంలో.. ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు జోయ్ భట్టాచార్య, వ్యాఖ్యాత హర్షా భోగ్లే సంభాషించుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా భట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్ రాయల్స్ ఐదుగురు బౌలర్లు, ఐదుగురు బ్యాటర్లు, రియాన్ పరాగ్తో ఆడింది’’ అని అన్నాడు. వీటిపై రియాన్ పరాగ్ కాస్త ఘాటుగానే స్పందించాడు. అభిమానులు బాధపడటంలో ఓ అర్థముందని, ఇలాంటి విశ్లేషకులకు ఏమవుతుందో తెలియదని పేర్కొన్నాడు. ఏమైనా ఉంటే నేరుగా తనకే మెసేజ్ చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి : ఈ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది.. ధోనీకి జడేజా బర్త్డే విషెస్
‘‘వెరిఫైడ్ ఖాతాలు కలిగిన మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు నా గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం కంటే.. నేరుగా నాకే సందేశం పంపితే సరిపోతుంది కదా. ఎవరైనాసరే ‘హాయ్, క్రికెట్ ఎలా ఆడగలుగుతున్నావు. ఒకవేళ ఇలా చేస్తే ఇంకాస్త ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’ అని సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తా. అంతేకానీ, సోషల్ మీడియాకెక్కి పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లో చాలా నేర్చుకున్నా. ఓర్పుతో ఎలా ఉండాలనేది తెలుసుకున్నా. నా ఇన్స్టాగ్రామ్లో పెట్టే పోస్టులన్నీ నా వ్యక్తిగత జీవితం గురించే ఉంటాయి.
ఇక ఐపీఎల్ 2023 సీజన్లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆడాలని భావించా. కానీ, తుది జట్టులో నాకు స్థానం దక్కలేదు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా. ఆ మ్యాచ్ల కోసం చాలా తీవ్రంగా సాధన చేశా. కష్టపడి సన్నద్ధమయ్యా. రోజు రెండుమార్లు మూడేసి గంటల సెషన్స్లో పాల్గొనేవాడిని. బౌలర్గానూ విపరీతంగా శ్రమించా. ఎలాంటి బంతులు వేస్తే వికెట్లు దక్కుతాయనేదానిపై కష్టపడ్డా. మరీ ముఖ్యంగా బెంగళూరుతో ఆడలేకపోయినందుకు చాలా బాధగా అనిపించింది. అలాంటి జట్టుపై ఆడితే అసలైన మజా వస్తుంది. విరాట్ కోహ్లీతో మైదానంలో తలపడటం నాకెంతో ఇష్టం. ఇక వారిని ఓడిస్తే ఆ సంతోషమే వేరు. అయితే అవకాశం రాకపోవడంతో హోటల్ గదికి వెళ్లిపోయా. అక్కడే అద్దంలో నా ముఖం చూసుకుని.. ‘ఈ మ్యాచ్ నుంచి నిన్ను తప్పించారు’ అని అనుకున్నా’’ అని రియాన్ పరాగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్