Riyan: అలా ట్వీట్లు చేసే బదులు.. నాకే మెసేజ్ చేయొచ్చు కదా..: రియాన్ పరాగ్
తనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించిన క్రికెట్ విశ్లేషకులపై రియాన్ పరాగ్ (Riyan Parag) స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో విమర్శలు ఎదుర్కొన్న యువ ఆటగాళ్లలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఒకడు. సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో గతంలో అతడు చేసిన వాటిని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కు గురయ్యాడు. నాలుగేళ్ల కిందట ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన రియాన్.. ఇటీవల ముగిసిన సీజన్లో ఏడు మ్యాచుల్లో కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో క్రికెట్ విశ్లేషకులు కూడా రియాన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు వాటిపై రియాన్ పరాగ్ స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన ట్విటర్లో పోస్టు చేసింది.
వీడియో ప్రారంభంలో.. ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు జోయ్ భట్టాచార్య, వ్యాఖ్యాత హర్షా భోగ్లే సంభాషించుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా భట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘రాజస్థాన్ రాయల్స్ ఐదుగురు బౌలర్లు, ఐదుగురు బ్యాటర్లు, రియాన్ పరాగ్తో ఆడింది’’ అని అన్నాడు. వీటిపై రియాన్ పరాగ్ కాస్త ఘాటుగానే స్పందించాడు. అభిమానులు బాధపడటంలో ఓ అర్థముందని, ఇలాంటి విశ్లేషకులకు ఏమవుతుందో తెలియదని పేర్కొన్నాడు. ఏమైనా ఉంటే నేరుగా తనకే మెసేజ్ చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి : ఈ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది.. ధోనీకి జడేజా బర్త్డే విషెస్
‘‘వెరిఫైడ్ ఖాతాలు కలిగిన మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు నా గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం కంటే.. నేరుగా నాకే సందేశం పంపితే సరిపోతుంది కదా. ఎవరైనాసరే ‘హాయ్, క్రికెట్ ఎలా ఆడగలుగుతున్నావు. ఒకవేళ ఇలా చేస్తే ఇంకాస్త ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది’ అని సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తా. అంతేకానీ, సోషల్ మీడియాకెక్కి పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లో చాలా నేర్చుకున్నా. ఓర్పుతో ఎలా ఉండాలనేది తెలుసుకున్నా. నా ఇన్స్టాగ్రామ్లో పెట్టే పోస్టులన్నీ నా వ్యక్తిగత జీవితం గురించే ఉంటాయి.
ఇక ఐపీఎల్ 2023 సీజన్లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆడాలని భావించా. కానీ, తుది జట్టులో నాకు స్థానం దక్కలేదు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా. ఆ మ్యాచ్ల కోసం చాలా తీవ్రంగా సాధన చేశా. కష్టపడి సన్నద్ధమయ్యా. రోజు రెండుమార్లు మూడేసి గంటల సెషన్స్లో పాల్గొనేవాడిని. బౌలర్గానూ విపరీతంగా శ్రమించా. ఎలాంటి బంతులు వేస్తే వికెట్లు దక్కుతాయనేదానిపై కష్టపడ్డా. మరీ ముఖ్యంగా బెంగళూరుతో ఆడలేకపోయినందుకు చాలా బాధగా అనిపించింది. అలాంటి జట్టుపై ఆడితే అసలైన మజా వస్తుంది. విరాట్ కోహ్లీతో మైదానంలో తలపడటం నాకెంతో ఇష్టం. ఇక వారిని ఓడిస్తే ఆ సంతోషమే వేరు. అయితే అవకాశం రాకపోవడంతో హోటల్ గదికి వెళ్లిపోయా. అక్కడే అద్దంలో నా ముఖం చూసుకుని.. ‘ఈ మ్యాచ్ నుంచి నిన్ను తప్పించారు’ అని అనుకున్నా’’ అని రియాన్ పరాగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆట తీరుపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా స్ట్రైక్రేట్ ఉండటం లేదని కొందరు మాజీలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వాటిపై ఏబీ డివిలియర్స్ స్పందించాడు. -
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
ఈ ఐపీఎల్ సీజన్లో తొలిసారి ధోనీ ఔటయ్యాడు. అయితే, అతడు చివరి ఓవర్లో సింగిల్ను తిరస్కరించడంపై నెట్టింట చర్చకు తెర లేచింది. -
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం