Dhoni BirthDay: ఈ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతుంది.. ధోనీకి జడేజా బర్త్డే విషెస్
భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్గా రికార్డు సృష్టించిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఇవాళ 42వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. క్రికెటర్లు పెద్ద ఎత్తున ధోనీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni Birth Day) 42వ జన్మదినం సందర్భంగా క్రికెట్ ఆటగాళ్లు, అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ధోనీ నాయకత్వంలో ఐదోసారి ఐపీఎల్ విజేతగా చెన్నైసూపర్ కింగ్స్ నిలవడంతో.. మహేంద్రుడికిది స్పెషల్ బర్త్డే. సీఎస్కే విజేతగా నిలవడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో వీరోచితంగా ఆడి జట్టును గెలిపించాడు. ‘ధోనీ కోసమే ఈ విజయం’ అంటూ జడేజా అప్పట్లో వ్యాఖ్యానించాడు. తాజాగా ధోనీ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జడేజా చేసిన పోస్టు వైరల్గా మారింది.
‘‘2009 నుంచి ఇప్పటి వరకు నీతోనే నా ప్రయాణం.. అలాగే ఎప్పటికీ ఇలాగే సాగుతా. మహీ భాయ్ జన్మదిన శుభాకాంక్షలు. త్వరలోనే మళ్లీ యెల్లో జెర్సీలో కలుద్దాం’’
- రవీంద్ర జడేజా
‘‘నాకెంతో ఇష్టమైన ఎంఎస్ ధోనీకి బర్త్డే విషెస్’’
- హార్దిక్ పాండ్య
‘‘టీమ్ఇండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జన్మదిన శుభాకాంక్షలు. నాయకత్వం, అద్భుతమైన నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచావు. భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగాలి. భారత్ క్రికెట్కు ఎనలేని సేవలు అందిస్తూనే ఉండాలి’’
- జైషా, బీసీసీఐ కార్యదర్శి
‘‘నా పెద్దన్న ధోనీకి బర్త్డే విషెస్. మైదానంలో క్రికెట్ విషయాల నుంచి.. మన కలలను పంచుకోవడం వరకూ ఎప్పటికీ మన బంధం విడదీయరానిది. నాయకుడిగా, ఓ స్నేహితుడిగా వెలుతురులో పయనించేలా నాకు మార్గదర్శకుడిగా ఉన్నావు. ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నా. సక్సెస్, ఆరోగ్యం, సంతోషంగా గడపాలి’’
- సురేశ్ రైనా
‘‘హెలికాప్టర్ షాట్లు, సెకన్ల వ్యవధిలోనే స్టంపౌట్లతో మ్యాచ్ను చూసేలా చేయడంలో ముందుంటావు. వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తావు, హ్యాపీ బర్త్డే’’
- మయాంక్ అగర్వాల్
‘‘ఇవాళ, రేపు.. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. ‘తలా’కు జన్మదిన శుభాకాంక్షలు’’
- చెన్నై సూపర్ కింగ్స్
‘‘ఐపీఎల్ సందర్భంగా నీతో సంభాషించిన సమయం అత్యున్నతమైంది. నువ్విచ్చిన సలహాలు విలువైనవి. ధోనీకి హ్యాపీ బర్త్డే విషెస్’’
- తిలక్ వర్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?