Rajasthan vs Delhi: మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దిల్లీపై 12 పరుగుల తేడాతో గెలిచింది. యువ ఆటగాడు రియాన్ పరాగ్ (84*) అద్భుత ఆటతీరుతో రాణించాడు. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, గత రెండు సీజన్లలో తన చెత్త ప్రదర్శనతో విమర్శలూ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్లీతో మ్యాచ్ అనంతరం రియాన్ (Riyan Parag) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘భావోద్వేగాలను నియంత్రించుకోవడం అలవాటైపోయింది. మా అమ్మ ఇక్కడే ఉన్నారు. గత నాలుగేళ్లుగా నా కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. అయితే, నాపై ఆత్మవిశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. నేను సున్నాకే ఔటైనా అలాగే ఉంటా. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన ఇవ్వడం కలిసొచ్చింది. ఐపీఎల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్లోని టాప్ -4లో ఒకరు 20 ఓవర్లపాటు క్రీజ్లో ఉంటే ప్రత్యర్థికి భారీ స్కోరును లక్ష్యంగా నిర్దేశించేందుకు అవకాశం ఉంటుంది. తొలి మ్యాచ్లో సంజూ చేసిన పని అదే. ఇప్పుడు ఆ అవకాశం నాకు వచ్చింది. అయితే, ఈ మ్యాచ్కు ముందు మూడు రోజులు బెడ్పైనే ఉన్నా. పెయిన్ కిల్లర్స్ను వాడా. రెండో మ్యాచ్ కోసం తీవ్రంగా కష్టపడ్డా. ఇప్పుడు ఆ ఫలితం అందుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అని రియాన్ తెలిపాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కిన విషయం తెలిసిందే.
వైడ్ యార్కర్లు వేయాలని ముందే నిర్ణయించుకున్నా: అవేశ్
‘‘చివరి ఓవర్లో నా ప్రణాళిక ఒక్కటే. ఒకవైపు బౌండరీ లైన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వైడ్లెంగ్త్లో యార్కర్ను సంధించాలని అనుకున్నా. ప్రతి బంతి కోసం ఐదు సెకన్లు కేటాయించుకున్నా. ఒకవేళ బ్యాటర్ మంచి షాట్తో కొట్టినా యార్కర్లను సంధించడంలో వెనక్కి తగ్గకూడదని భావించా. బౌల్ట్, బర్గర్, సందీప్ శర్మ వంటి అద్భుత పేస్ బౌలర్లు ఉన్నారు. వారి నుంచి చాలా అంశాలను నేర్చుకుంటున్నా. మా మేనేజ్మెంట్ కుమార సంగక్కర మద్దతు అద్వితీయం. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. టీ20ల్లో విభిన్నంగా బంతులను సంధిస్తే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుంది. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా’’ అని అవేశ్ ఖాన్ తెలిపాడు. చివరి ఓవర్లో దిల్లీకి 17 పరుగులు అవసరం కాగా.. అవేశ్ కేవలం నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా