Virat - Rohit: వేకువజాము మంచులాంటిది ఫామ్.. వారి విషయంలో సమస్యే కాదు: సిద్ధూ
విరాట్ - రోహిత్.. టీమ్ఇండియా క్రికెట్కు మూల స్తంభాలు. వచ్చే టీ20 ప్రపంచ కప్లో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండో కప్ను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల కిందట జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ మ్యాచ్లు ఎక్కువగా ఆడలేదు. అయినా సరే వారిద్దరూ రాబోయే పొట్టి కప్లో కీలక పాత్ర పోషిస్తారని క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ వ్యాఖ్యానించాడు. కామెంటేటర్గా మళ్లీ పునరాగమనం చేసిన క్రమంలో ఓ చర్చా కార్యక్రమంలో సిద్ధూ మాట్లాడాడు.
‘‘పొట్టి కప్లో టాప్ ప్లేయర్ల అవసరం ఉంది. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లు. ఫామ్ అనేది వారి విషయంలో ఉదయం వేళ వచ్చే మంచులాంటిది. అది త్వరగానే సమసిపోతుంది. క్లాస్ ఆటతీరుతో క్రికెట్పై తమ ముద్ర వేశారు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli) అత్యుత్తమ భారత క్రికెటర్ అనడానికి కారణం అతడి ఫిట్నెస్ స్థాయి. వయసు పెరిగే కొద్దీ మరింత ఫిట్గా మారాడు. మూడు ఫార్మాట్లో రాణించగల సత్తా విరాట్ సొంతం. రోహిత్ (Rohit Sharma) పరిస్థితి కూడా ఇలాంటిదే. ఇద్దరూ నాణ్యమైన క్రికెటర్లు. హిట్మ్యాన్ ఫిట్నెస్ ఎలా ఉంటుందో తెలియదు. ఏజ్ పెరిగే కొద్దీ దూకుడు తగ్గడం సహజం. కానీ, రోహిత్ విషయంలో అలా జరగదు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా చివరి వరకూ దూకుడుగా ఆడాడు.
గత కొన్నాళ్లుగా నేను క్రికెట్తో టచ్ లేనప్పటికీ.. నిశితంగా గమనిస్తూనే ఉన్నా. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్లో భారత్ అద్భుతంగా ఆడింది. ఒకే ఒక్క బ్యాడ్ గేమ్తో టైటిల్ను కోల్పోయింది. దీంతో జట్టు భవిష్యత్తును అంచనా వేయడం సరికాదు. సుదీర్ఘకాలం క్రికెట్పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించడానికి కారణం వ్యవస్థ బలంగా ఉండటమే. మేం ఆడిన రోజుల్లో ఎవరి ఫామ్ బాగోలేకపోయినా పెద్ద సమస్య అయ్యేది కాదు. రిప్లేస్మెంట్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంది. ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా వచ్చిన హార్దిక్ పాండ్య మెరుగైన ప్రదర్శన చేస్తే భారత జట్టు సారథి అయ్యే అవకాశాలున్నాయి’’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి