IND vs PAK: పిచ్ క్యురేటర్కూ తప్పని అయోమయం: రోహిత్ శర్మ
డ్రాప్ ఇన్ పిచ్పై ఆడటం సవాల్తో కూడకున్నదే. బ్యాటర్లు గాయాలబారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో తొలి విజయం సాధించిన భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్తో టీమ్ఇండియా తలపడనుంది. అయితే, ఆ పిచ్పై ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్లో మార్పులు చేస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి. వాటిపై ఐసీసీ క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా పాక్తో మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాక్తో పోరు.. ఏడులో ఆరు భారత్వే!
‘‘న్యూయార్క్ మా సొంత మైదానం కాదు. ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్లను మాత్రమే ఆడాం. పిచ్ను అర్థం చేసుకొనేందుకు అది సరిపోదు. ఒక్కో రోజు ఒక్కోలా పిచ్ ప్రభావం చూపిస్తోంది. దీంతో పిచ్ తయారీలో కీలకమైన క్యురేటర్ కూడా అయోమయానికి గురయ్యాడు. పాక్తో మ్యాచ్ ఏ పిచ్పై ఆడతామో తెలియదు. అత్యుత్తమ ప్రదర్శన చేసినవారిదే విజయం. అవుట్ ఫీల్డ్ కూడా చాలా నెమ్మదిగా ఉంది. కొన్ని సార్లు ఎక్కువ బౌన్స్తో బంతి వెళ్తుంది. మరికొన్నిసార్లు పైకే లేవడం లేదు. ఇక వికెట్ల మధ్య పరుగెత్తడం కూడా చాలా ముఖ్యమే. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన క్రికెట్ ఆడటమే ముఖ్యం. ప్రత్యర్థి ఎవరు? పిచ్ ఎలా ఉంది? అనేవి కీలకం కాదు’’ అని రోహిత్ తెలిపాడు.
వర్షం ముప్పు ఉందా?
దాయాదుల మధ్య పోరును చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే, మ్యాచ్కు వర్షం ముప్పు ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ, వాతావరణ శాఖ నివేదికలనుబట్టి వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశమంతా మబ్బులు పట్టి ఉన్నప్పటికీ మ్యాచ్ నిర్వహణకు అంతరాయం కలగకపోవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?