IND vs PAK: పాక్తో పోరు.. ఏడులో ఆరు భారత్వే!
భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూసే క్రికెట్ అభిమానులు కోకొల్లలు. ఆటగాళ్లకూ ఆ మ్యాచ్పై టెన్షన్ ఉంటుందంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ చూసేందుకు ఆసక్తిగా ఉండాలంటే సమవుజ్జీలు బరిలోకి దిగాలి. అప్పుడే ఆ మ్యాచ్ను ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అలాంటి పోరుల్లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ (IND vs PAK) ఒకటి. మళ్లీ టీ20 వరల్డ్ కప్ పుణ్యామా అని అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఏడుసార్లు జరిగిన పొట్టి కప్లో రెండు జట్లు తలపడగా.. ఆరింట్లో భారత్ గెలిచింది. ఒకదాంట్లోనే పాక్ను విజయం సాధించింది. మరి ఆయా మ్యాచుల్లో ఎవరు సత్తా చాటారో చూద్దాం..
- బౌల్ ఔట్: ఎంఎస్ ధోనీ నాయకత్వంలో టీమ్ఇండియా గెలిచిన ఏకైక టీ20 వరల్డ్ కప్. తొలి ఎడిషన్ కూడా అదే. డర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ ‘బౌల్ ఔట్’ పద్ధతిలో విజయం సాధించింది. రాబిన్ ఉతప్ప (50) ఫిఫ్టీ చేసి రాణించాడు. స్కోర్లు సమం కావడంతో బౌల్ ఔట్ ద్వారా విజేతను నిర్ణయించారు. భారత ప్లేయర్లు వరుసగా మూడుసార్లు వికెట్లను పడగొట్టగా.. పాక్ ఒక్కసారి కూడా స్టంప్స్ తాకలేక ఓటమి పాలైంది.
- జోగిందర్ దెబ్బ: ఒకే సీజన్లో రెండుసార్లు దాయాది జట్లు ఎదురుపడటం గమనార్హం. గౌతమ్ గంభీర్ (75), రోహిత్ శర్మ (30*) బ్యాటింగ్లో అదరగొట్టారు. బౌలింగ్లోనూ ఇర్ఫాన్ పఠాన్ (3/16), ఆర్పీ సింగ్ (3/26) సత్తా చాటారు. చివరి ఓవర్లో కేవలం 13 పరుగులు అవసరం కాగా.. అప్పటికే 9 వికెట్లను కోల్పోయిన పాక్ను జోగిందర్ శర్మ (2/20) దెబ్బ కొట్టి భారత్ను గెలిపించాడు. కేవలం ఏడు రన్స్ మాత్రమే ఇచ్చాడు.
- బాలాజీ.. విరాట్: టీ20 వరల్డ్ కప్ 2012లో పాక్పై భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో లక్ష్మీపతి బాలాజీ (3/22) దెబ్బకు పాక్ 128 పరుగులకే ఆలౌట్ కాగా.. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (78*) దుమ్మురేపాడు. సెహ్వాగ్ (29), యువరాజ్ (19*) మద్దతుగా నిలిచారు. దీంతో పాక్పై పొట్టికప్లో హ్యాట్రిక్ కొట్టినట్లైంది.
- తలో చేయి వేసి..: ధోనీ నాయకత్వంలో మరోసారి పాక్పై భారత్ విజయం సాధించింది. తొలుత బౌలర్లు సత్తా చాటారు. పాక్ను కేవలం 130/7 స్కోరుకే పరిమితం చేశారు. ఇక టార్గెట్ను ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ (36*), సురేశ్ రైనా (35*) శిఖర్ ధావన్ (30), రోహిత్ శర్మ (24) రాణించడంతో భారత్ ఆడుతూపాడుతూ విజేతగా నిలిచింది.
- మళ్లీ విరాట్ : భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్- 2016 జరిగిన సంగతి తెలిసిందే. కోల్కతా వేదికగా టీమ్ఇండియా - పాక్ మ్యాచ్ జరిగింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో విరాట్ కోహ్లీ (55*) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 118/5 స్కోరుకే పరిమితం కాగా.. భారత్ 15.5 ఓవర్లలో నాలుగు వికెట్లను నష్టపోయి 119 పరుగులు చేసి విజయం సాధించింది.
- తొలి ఓటమి: ప్రపంచ కప్ల చరిత్రలో పాక్పై భారత్కు ఎదురైన తొలి ఓటమి. అప్రతిహతంగా సాగిపోతున్న విజయాల పరంపరకు బ్రేక్ పడింది. విరాట్ (57), పంత్ (39) రాణించినా.. పాక్ ఓపెనర్ల ముందు 152 పరుగుల టార్గెట్ సరిపోలేదు. రిజ్వాన్ (79*), బాబర్ అజామ్ (68*) వికెట్ ఇవ్వకుండా లక్ష్య ఛేదనను పూర్తి చేసేసి సంచలన విజయం నమోదు చేసింది. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేక ఇబ్బందిపడ్డారు.
- కోహ్లీ వదల్లేదు: రెండేళ్ల కిందట (2022) జరిగిన మ్యాచ్లో పాక్ బ్యాటర్లు షాన్ మసూద్ (52*), ఇఫ్తికార్ అహ్మద్ (51) హాఫ్ సెంచరీలు సాధించడంతో 159 పరుగులు చేయగలిగింది. హార్దిక్ పాండ్య (3/30), అర్ష్దీప్ సింగ్ (3/32) విజృంభించారు. లక్ష్య ఛేదనలో రోహిత్, కేఎల్ విఫలమైనా.. విరాట్ (82*) చివరివరకూ క్రీజ్లో ఉండి జట్టును గెలిపించాడు. హార్దిక్ (40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సరిగ్గా 20 ఓవర్లకు 160 పరుగులు చేసి విజయం సాధించింది.
- ఈసారి ఏమైవుతుందో?: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో ఇప్పటికే ఐర్లాండ్ను ఓడించిన భారత్ ఉత్సాహంగా ఉంది. మరోవైపు యూఎస్ఏ చేతిలో ఓడి నిరుత్సాహానికి గురైన పాక్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. మరోసారి విరాట్తోపాటు కెప్టెన్ రోహిత్, సూర్య కుమార్ నుంచి కీలక ఇన్నింగ్స్లు రావాలని భారత అభిమానుల కోరిక. బౌలింగ్లో బుమ్రాతోపాటు హార్దిక్, అర్ష్దీప్ మంచి ఫామ్లో ఉన్నారు. దీనిని కొనసాగిస్తే పాక్ను ఓడించడం పెద్ద కష్టమేం కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్