Rohit Sharma: అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ కోసం (T20 World Cup 2024) భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్క్వాడ్లో ఎవరు ఉంటారు? ఎవరిని పక్కన పెడతారు? అనేది ఆసక్తిగా మారింది. యువ క్రికెటర్లతోపాటు సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భేటీ అయ్యాడని.. జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను ఎవరినీ కలవలేదని రోహిత్ తాజాగా స్పష్టం చేశాడు. అలాగే ధోనీకి సంబంధించిన ఆసక్తికర విశేషాలను హిట్మ్యాన్ వెల్లడించాడు. ఐపీఎల్లో నేడు పంజాబ్తో ముంబయి తలపడనుంది. ఈ నేపథ్యంలో ఓ పాడ్కాస్ట్లో అతడు పాల్గొన్నాడు.
‘‘నేను ఎవరినీ కలవలేదు. అదంతా ఫేక్ న్యూస్. అజిత్ అగార్కర్ దుబాయ్లో ఉన్నాడు. అక్కడ గోల్ఫ్ ఆడేందుకు వెళ్లాడు. రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో పిల్లలతో సమయం గడుపుతున్నాడు. మేం ఎక్కడా కలుసుకోలేదు. ఏదైనా కీలక సమాచారం ఇవ్వాలనుకుంటే మా ముగ్గురిలో ఎవరో ఒకరం అందరికీ తెలిసేలా వెల్లడిస్తాం. కాబట్టి, సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ అవాస్తవాలే. ఇక ధోనీని (MS Dhoni) వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్కు వచ్చేలా ఒప్పించడం కష్టమే. ఐపీఎల్లో ఆడటం వల్ల అతడు అలసిపోతాడు. తన మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. విండీస్కు రాకపోవచ్చు. కానీ, అమెరికాకు వచ్చే అవకాశాలున్నాయి. గోల్ఫ్ ఆడేందుకు వస్తాడని అనుకుంటున్నా. అతడు ముంబయిపై కేవలం నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. అవే మా ఓటమిని ఖాయం చేశాయి’’ అని రోహిత్ తెలిపాడు. అంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 సమయంలో భారత జట్టు మెంటార్గా ధోనీ సేవలందించిన సంగతి తెలిసిందే.
వారిద్దరిలో ఒకరు కష్టమేనా?
జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నెలాఖరు నాటికి 15మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించాలి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంకా సమావేశం కాలేదని రోహిత్ మాటలను బట్టి తెలుస్తోంది. అయితే, ఇప్పటికే జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు మాత్రం బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా జట్టును ఎంపిక చేయాలని కమిటీ భావిస్తోందని సమాచారం. ఐపీఎల్లో పెద్దగా రాణించలేకపోతున్న గిల్, యశస్వి జైస్వాల్లో ఒకరిని పక్కన పెట్టే అవకాశాలున్నాయి. రింకు సింగ్, శివమ్ దూబె జట్టులోకి రావడం పక్కా అని క్రికెట్ విశ్లేషకుల అంచనా. రెండో వికెట్ కీపర్ కోసం మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. రిషభ్ పంత్కు తోడుగా సంజూ లేదా కేఎల్ రాహుల్, జితేశ్, ఇషాన్లో ఎవరికి అవకాశం వస్తుందో తెలియని పరిస్థితి. అందరూ ఫామ్లోనే ఉన్నారు. విరాట్ కోహ్లీని తీసుకోవడం ఖాయమే. కానీ, అతడిని ఏ స్థానంలో బ్యాటింగ్కు పంపిస్తారనేది మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ గిల్/జైస్వాల్ ఉంటే రోహిత్తో వారే ఓపెనింగ్ చేస్తారు. అప్పుడు కోహ్లీ వన్డౌన్ లేదా సెకండ్ డౌన్లో ఆడాల్సి ఉంటుంది. దానిపై అతడు కూడా స్పష్టత ఇవ్వాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే వారంలో జట్టు ఎంపిక దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.