Rohit Sharma: అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ కోసం (T20 World Cup 2024) భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్క్వాడ్లో ఎవరు ఉంటారు? ఎవరిని పక్కన పెడతారు? అనేది ఆసక్తిగా మారింది. యువ క్రికెటర్లతోపాటు సీనియర్ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) భేటీ అయ్యాడని.. జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను ఎవరినీ కలవలేదని రోహిత్ తాజాగా స్పష్టం చేశాడు. అలాగే ధోనీకి సంబంధించిన ఆసక్తికర విశేషాలను హిట్మ్యాన్ వెల్లడించాడు. ఐపీఎల్లో నేడు పంజాబ్తో ముంబయి తలపడనుంది. ఈ నేపథ్యంలో ఓ పాడ్కాస్ట్లో అతడు పాల్గొన్నాడు.
‘‘నేను ఎవరినీ కలవలేదు. అదంతా ఫేక్ న్యూస్. అజిత్ అగార్కర్ దుబాయ్లో ఉన్నాడు. అక్కడ గోల్ఫ్ ఆడేందుకు వెళ్లాడు. రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో పిల్లలతో సమయం గడుపుతున్నాడు. మేం ఎక్కడా కలుసుకోలేదు. ఏదైనా కీలక సమాచారం ఇవ్వాలనుకుంటే మా ముగ్గురిలో ఎవరో ఒకరం అందరికీ తెలిసేలా వెల్లడిస్తాం. కాబట్టి, సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ అవాస్తవాలే. ఇక ధోనీని (MS Dhoni) వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్కు వచ్చేలా ఒప్పించడం కష్టమే. ఐపీఎల్లో ఆడటం వల్ల అతడు అలసిపోతాడు. తన మోకాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. విండీస్కు రాకపోవచ్చు. కానీ, అమెరికాకు వచ్చే అవకాశాలున్నాయి. గోల్ఫ్ ఆడేందుకు వస్తాడని అనుకుంటున్నా. అతడు ముంబయిపై కేవలం నాలుగు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. అవే మా ఓటమిని ఖాయం చేశాయి’’ అని రోహిత్ తెలిపాడు. అంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 సమయంలో భారత జట్టు మెంటార్గా ధోనీ సేవలందించిన సంగతి తెలిసిందే.
వారిద్దరిలో ఒకరు కష్టమేనా?
జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నెలాఖరు నాటికి 15మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించాలి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంకా సమావేశం కాలేదని రోహిత్ మాటలను బట్టి తెలుస్తోంది. అయితే, ఇప్పటికే జట్టు ఎంపికపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు మాత్రం బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా జట్టును ఎంపిక చేయాలని కమిటీ భావిస్తోందని సమాచారం. ఐపీఎల్లో పెద్దగా రాణించలేకపోతున్న గిల్, యశస్వి జైస్వాల్లో ఒకరిని పక్కన పెట్టే అవకాశాలున్నాయి. రింకు సింగ్, శివమ్ దూబె జట్టులోకి రావడం పక్కా అని క్రికెట్ విశ్లేషకుల అంచనా. రెండో వికెట్ కీపర్ కోసం మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. రిషభ్ పంత్కు తోడుగా సంజూ లేదా కేఎల్ రాహుల్, జితేశ్, ఇషాన్లో ఎవరికి అవకాశం వస్తుందో తెలియని పరిస్థితి. అందరూ ఫామ్లోనే ఉన్నారు. విరాట్ కోహ్లీని తీసుకోవడం ఖాయమే. కానీ, అతడిని ఏ స్థానంలో బ్యాటింగ్కు పంపిస్తారనేది మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ గిల్/జైస్వాల్ ఉంటే రోహిత్తో వారే ఓపెనింగ్ చేస్తారు. అప్పుడు కోహ్లీ వన్డౌన్ లేదా సెకండ్ డౌన్లో ఆడాల్సి ఉంటుంది. దానిపై అతడు కూడా స్పష్టత ఇవ్వాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే వారంలో జట్టు ఎంపిక దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ