Rohit Sharma: ఇది అత్యుత్తమ జట్టే.. ఆ ప్రశ్నకు ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పా: రోహిత్
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) కోసం భారత జట్టును ప్రకటించే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ జర్నలిస్ట్పై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక విషయాలపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ (ODi World Cup 2023) కోసం భారత్ తన జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ వెల్లడించాడు. ప్రస్తుతం టీమ్ఇండియా ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న విషయం తెలిసిందే. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ తన జట్టుపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు. అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాడు.
అద్భుతమైన టాలెంట్ ఉంది..
‘‘క్రికెట్లో 50 ఓవర్ల ఫార్మాట్ చాలా విభిన్నంగా ఉంటుంది. నిలకడగా ఆడుతూనే అవసరమైనప్పుడు దూకుడు పెంచాల్సి ఉంటుంది. వచ్చే వరల్డ్ కప్లో 9 లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ప్రతిసారి మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాలి. గత వరల్డ్ కప్లో ఇలాగే ఇంగ్లాండ్ విజేతగా నిలవడం చూశాం. ఈసారి ఆయా జట్ల కాంబినేషన్, వ్యూహాలు, ప్రణాళికలపై ఆలోచించడానికి అదనపు సమయం ఉంది. తప్పకుండా ఈసారి మేం అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. బలమైన జట్టును తయారు చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ప్రపంచ కప్ కోసం 15 మందిని ఎంపిక చేయడం కఠిన సవాలే.
అనుకున్నట్లే ఆ ముగ్గురికీ దక్కని చోటు.. వన్డే ప్రపంచ కప్నకు భారత జట్టు ఇదే..
లోతైన బ్యాటింగ్ విభాగంతోపాటు స్పిన్, పేస్ బౌలింగ్ వనరులతో వన్డే ప్రపంచకప్ ఆడబోతున్నాం. అయితే, తుది జట్టు ఎలా ఉంటుందనేది ఇప్పటికప్పుడే చెప్పలేం. మ్యాచ్ రోజు పరిస్థితులను బట్టి ఎంపిక ఉంటుంది. ప్రత్యర్థి విసిరే సవాల్ను అనుసరించి తుది జట్టుతో బరిలోకి దిగుతాం. కొందరు వరల్డ్ కప్ సెలెక్షన్లో లేకపోవచ్చు. భారత్లో అద్భుతమైన టాలెంట్కు కొదువలేదనేదానికి ఇదొక నిదర్శనం. కానీ, 15 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రపంచ కప్ సందర్భంగా జట్టు ఎంపికలో ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. ఇప్పుడేమీ సర్ప్రైజ్ లేదు’’ అని రోహిత్ తెలిపాడు.
బయట ఏం జరుగుతుందనేది అనవసరం
ప్రెస్ కాన్ఫెరెన్స్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై రోహిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మెగా టోర్నీల్లో భారత్ ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయని, ఇలాంటి వాటిపై మీ స్పందనేంటని సదరు జర్నలిస్ట్ అడిగాడు. దానికి రోహిత్ కాస్త ఘాటుగా స్పందించాడు. ఇలాంటి ప్రశ్నలను తానెప్పుడూ ప్రోత్సహించనని, ఇప్పటికే చాలాసార్లు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ‘‘ఆసియా కప్ కోసం బయల్దేరకముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ఇదే ప్రశ్నకు సమాధానం ఇచ్చా. బయట ఎవరు ఏం మాట్లాడుకున్నా మేం పట్టించుకోం. జట్టులోని ప్రతి ఆటగాడు ప్రొఫెషనల్ క్రికెటరే. ఇలాంటి ప్రశ్నలు మళ్లీ అడగొద్దు. ఇలాంటి విషయాలపై స్పందించడం కూడా సరైంది కాదు. ప్రస్తుతం మా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. ఇలాంటి విషయాలను పట్టించుకోం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..