Rohit Sharma: హై హై నాయకా.. వరల్డ్ కప్ ‘హిట్మ్యానే’ వేరు..!
ఆసీస్తో పోరాడి గెలిచిన భారత్.. అఫ్గాన్తో మాత్రం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ విజయ సాధించింది. దీంతో వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) టీమ్ఇండియా పాయింట్ల పట్టికలో ద్వితీయ స్థానానికి దూసుకుపోయింది. ఇలా అఫ్గాన్పై భారీ విజయం సాధించడంలో రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక పాత్ర పోషించాడు.
అతడు పది ఓవర్లు క్రీజ్లో ఉంటేనే మ్యాచ్పై ప్రత్యర్థులు ఆశలు వదులుకోవాల్సిందే. ఇక కుదురుకున్నాడంటే ఆ రోజు చాలా రికార్డులు గల్లంతైనట్లే. అలవోకగా సిక్స్లు కొట్టేయగల సమర్థుడు. ఇక ప్రపంచ కప్ (ODI World Cup 2023) అంటే గాడ్ మోడ్లోకి మారిపోతాడు. మెగా సమరంలో పరుగుల ఎలా పారించాలో అతడికి బాగా తెలుసు. ఇంత పెద్ద టోర్నీకి తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా.. ఎక్కడా ఆ ఒత్తిడి కనిపించలేదు. ఇప్పటికే అర్థమైపోయిందిగా ఎవరా అతడని? మన హిట్మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma).
అఫ్గాన్పై భారీ సెంచరీతో రోహిత్ మళ్లీ భారత్కు ఊపు తెచ్చాడు. ఒక్క మ్యాచ్తో ఎన్నో రికార్డులను తన ఖాతాలో జమచేసుకొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో దురదృష్టవశాత్తూ ఇన్స్వింగర్కు బలైనా.. ఆ ప్రభావం ఈ మ్యాచ్లో ఎక్కడా కనిపించలేదు. బ్యాట్తో అఫ్గాన్పై విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్మార్క్ షాట్లతో వరల్డ్ కప్లోనే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా ఘనత సాధించాడు. దాదాపు 40 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును చెరిపేశాడు. ఇప్పటికే సచిన్, క్రిస్ గేల్ రికార్డులను కూడా అధిగమించాడు. కీలక సమయంలో అద్భుత ఫామ్ను అందిపుచ్చుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.
వరల్డ్ కప్ల్లో విధ్వంసం..
ద్వైపాక్షిక సిరీసుల్లో కెప్టెన్గా రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. అయితే, బ్యాటర్గా వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీల్లో అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు ఆడేది మూడో వరల్డ్ కప్ అయినా సరే.. ఐదు ప్రపంచకప్లు ఆడిన వారికి కూడా సాధ్యం కాని విధంగా ఏడు సెంచరీలను నమోదు చేశాడు. అందుకే, విరాట్ కోహ్లీ లక్ష్య ఛేదనలో కింగ్ అయితే.. రోహిత్ ‘వరల్డ్ కప్ హీరో’ అనడంలో సందేహం లేదు. కేవలం 19 ఇన్నింగ్స్ల్లోనే ఏడు శతకాలు బాదడం చూస్తేనే.. అతడి విధ్వంసం ఏస్థాయిలో ఉంటుందో తెలుస్తోంది. ఇందులో మూడు సెంచరీలు లక్ష్యఛేదన సమయంలోనే కావడం విశేషం. ప్రస్తుతం అతడి ఫామ్ను చూస్తుంటే ఈ టోర్నీలో శతకాల సంఖ్య 10కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2015 వరల్డ్ కప్లో ఒకటి, 2019లో ఏకంగా ఐదు సెంచరీలు సాధించాడు.
సిక్స్లు అలా కొట్టేందుకు కారణమదే..
రోహిత్ శర్మ సిక్స్లను అలవోకగా కొడతాడని మనకు తెలుసు. తాజాగా అఫ్గాన్పైనా ఐదు సిక్స్లు బాదేశాడు. ఇతర బ్యాటర్లతో పోలిస్తే బంతిని కాస్త ముందుగానే అంచనా వేసి షాట్ కొట్టడంలో రోహిత్ దిట్ట. దీనింతటికి కారణం అద్భుతమైన అతడి టైమింగ్. ఇదేదో బయట నుంచి చూసిన వారు చెప్పింది కాదు. స్వయంగా రోహిత్ శర్మనే వెల్లడించాడు. నాలుగేళ్ల కిందట బంగ్లాతో జరిగిన ఓ మ్యాచ్ అనంతరం యుజ్వేంద్ర చాహల్తో మాట్లాడుతూ.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సిక్స్లు కొట్టాలంటే భారీ శరీరం ఉండక్కర్లేదు. నువ్వైనా (చాహల్ను) సిక్స్లు కొట్టేయచ్చు. అయితే, దానికి కావాల్సింది టైమింగ్. బంతిని సరిగ్గా అంచనావేసి హిట్ చేస్తే చాలు. బ్యాట్కు మధ్యలో తగలాలి. అందుకే, సిక్స్ బాదాలంటే కొన్ని విషయాలపై సాధన చేయాలి’’ అని రోహిత్ చెప్పాడు.
ఇదొక్కటి సాధిస్తే..
భారత్ దాదాపు పదేళ్ల నుంచి ఐసీసీ టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. చివరి సారిగా ఎంఎస్ ధోనీ నాయకత్వంలో (2013) ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా దక్కించుకుంది. అంతకుముందు 2011వరల్డ్ కప్ను కూడా ధోనీ సారథ్యంలో సాధించింది. ఆ తర్వాత వన్డే, టీ20 ప్రపంచకప్లు జరిగినా ఛాంపియన్గా నిలవలేకపోయింది. ఈసారి మాత్రం అన్నీ శుభ శకునాలే. తాజాగా ఆరు దేశాలు తలపడిన ఆసియా కప్ను భారత్ సొంతం చేసుకుంది. వన్డే ప్రపంచకప్లోకి అడుగు పెట్టే నాటికి మూడు ఫార్మాట్లలోనూ నెంబర్వన్ అయింది. ఇటు రాహుల్ వంటి ఆటగాళ్లూ అద్భుతమైన ఫామ్లోకి వచ్చేశారు. వరల్డ్ కప్లోనూ శుభారంభం లభించింది. ఇదే ఒరవడిని కొనసాగించి ముచ్చటగా మూడో వరల్డ్ కప్ను రోహిత్ నాయకత్వంలో జట్టు ముద్దాడాలని భారతావని కోరుకుంటోంది.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు