MS Dhoni: ధోని నిర్ణయంపై రోహిత్ స్పందనిదే..
MS Dhoni: సీఎస్కే కెప్టెన్గా ధోని తప్పుకోవడంపై రోహిత్ శర్మ స్పందించాడు. మరోవైపు కొత్తగా ఆ జట్టు సారథ్య బాధ్యతలు తీసుకోనున్న రుతురాజ్కు సూర్యకుమార్ యాదవ్ విలువైన సూచన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఎం.ఎస్.ధోని (MS Dhoni). జట్టు సారథిగా అభిమానుల గుండెల్లో తనదైన ముద్ర వేసిన ఈ కెప్టెన్ కూల్.. నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 (IPL 2024) ప్రారంభానికి ఒక్క రోజు ముందు తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపర్చాడు. అతని నిర్ణయంపై ముంబయి ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ స్పందించాడు.
రోహిత్ షేక్హ్యాండ్..
ధోని నిర్ణయం వెలువడిన కాసేపటికే అతడితో ఉన్న బంధాన్ని రోహిత్ (Rohit sharma) తన ఇన్స్టా అప్డేట్లో ఓ పొటోతో పంచుకున్నాడు. కెప్టెన్గా ఉన్న సమయంలో ఇరువురూ చేయి చేయి కలుపుతున్న దృశ్యాన్ని షేర్ చేశాడు. కింద షేక్హ్యాండ్ ఎమోజీని ఉంచాడు. మరోవైపు ఈ సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధోని నిర్ణయంపై రోహిత్ స్పందనకు ప్రాధాన్యం ఏర్పడింది.
దశాబ్దాల పాటు గుర్తుండిపోతుంది..
టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ధోని నిర్ణయంపై స్పందించాడు. కెప్టెన్ కూల్ నాయకత్వం దశాబ్దాలపాటు నిలిచిపోతుందని ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న క్రికెట్ గెలాక్సీలో సీఎస్కే సారథిగా ధోని వారసత్వం ఓ ఉజ్వల తారలా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఫ్రాంచైజీకి మార్గాన్ని చూపుతుంది. అతడి నాయకత్వం దశాబ్దాలపాటు గుర్తుండిపోతుంది. CSK లీడర్గా కొత్తగా బాధ్యతలు తీసుకోనున్న రుతురాజ్కు శుభాకాంక్షలు’’ అని ఇర్ఫాన్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.
ధోని ఎప్పటికీ నాయకుడే..
మరోవైపు భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం ధోనీని ప్రశంసించాడు. అతడు వ్యవహరించే విధానం తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఎలాంటి గందరగోళం లేకుండా నిష్క్రమించాడని అభిప్రాయపడ్డాడు. ధోని ఎప్పటికీ నాయకుడే అని కొనియాడాడు.
పెద్ద బాధ్యతే: సూర్యకుమార్
సీఎస్కే కెప్టెన్గా వ్యవహరించనున్న రుతురాజ్ గైక్వాడ్కు ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలుపుతూనే బాధ్యతలను గుర్తుచేశాడు. ‘‘ధోని స్థానాన్ని భర్తీ చేసే పెద్ద బాధ్యత నీపై ఉంది. నీ ప్రశాంత స్వభావంతో జట్టు వారసత్వాన్ని నీదైన శైలిలో ముందుకు తీసుకెళ్తావని నమ్ముతున్నాను. అందరి ప్రేమ, ఆశీస్సులు నీకు దక్కాలని కోరుకుంటున్నా’’ అని సూర్య తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశాడు.
చెన్నై సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఐపీఎల్-17 ఆరంభానికి ఒక రోజు ముందు ధోని ప్రకటించాడు. రుతురాజ్ గైక్వాడ్ కొత్త కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఆటగాడిగా ధోనీకి ఇదే ఆఖరి సీజన్ కావొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. చెన్నైతో అతడిది విడదీయరాని బంధం. ఆటగాడిగా నిష్క్రమించినా ఏదో ఒక పాత్రలో సీఎస్కేతో కొనసాగుతాడని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు