WPL 2024: డబ్ల్యూపీఎల్.. 2 పరుగుల తేడాతో యూపీపై ఆర్సీబీ విజయం
మహిళా క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు. డబ్ల్యూపీఎల్ రెండో మ్యాచ్లోనూ అభిమానులకు క్రికెట్ మజాను రుచి చూపించారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో రెండో మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకూ సాగిన ఈ మ్యాచ్లో యూపీ వారియర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (UPW vs RCB) రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ 155/7 స్కోరుకే పరిమితమైంది. శోభనా ఆశా 5 వికెట్లు తీసి యూపీని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లను పడగొట్టింది. దీంతో యూపీ లక్ష్యఛేదన కష్టంగా మారింది.
శోభనా ఆశా అదుర్స్..
బెంగళూరు నిర్దేశించిన లక్ష్యం పెద్దదేమీ కాదు. కానీ, యూపీ వారియర్స్ బ్యాటర్లను కట్టడి చేయడంలో మాత్రం ఆర్సీబీ బౌలర్లు సక్సెస్ అయ్యారు. ప్రమాదకరమైన బ్యాటర్ ఎలీసా హీలేను (5)ను ఔట్ చేసి మోలినెక్స్ వికెట్ల పతనానికి తెరలేపింది. ఆ తర్వాత శోభనా ఆశా చెలరేగిపోయింది. కీలకమైన వ్రిందా దినేశ్ (18), తహ్లియా మెక్గ్రాత్ (22), గ్రేస్ హారిస్ (38), శ్వేతా షెహ్రవాత్ (31), కిరణ్ నవ్గిరె (1) వికెట్లను తీసింది. పూనమ్ ఖెమ్నర్ (14), దీప్తి శర్మ (13*) కాస్త దూకుడుగా ఆడి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చారు. అయితే, చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ బౌలర్ మోలినెక్స్ కేవలం 8 పరుగులే ఇచ్చింది. దీంతో బెంగళూరు ఖరారైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శోభనా నిలిచింది.
మేఘన, రిచా హాఫ్ సెంచరీలు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతీ మంధాన (13), సోఫీ డివైన్ (1) విఫలమయ్యారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53: 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), రిచా ఘోష్ (62: 37 బంతుల్లో 12 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. ఎలీసా పెర్రీ 8, సోఫీ 9*, శ్రేయాంక పాటిల్ 2* పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2.. గ్రేస్ హారిస్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ ఎక్లెస్లోన్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం