RCB vs UPW: మెరిసిన ఆర్సీబీ బ్యాటర్లు మేఘన, రిచా ఘోష్.. యూపీ విజయలక్ష్యం 158
యూపీ వారియర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆర్సీబీ బ్యాటర్లు భారీ స్కోరు సాధించలేకపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో సీజన్లో యూపీ వారియర్స్ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 158 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతీ మంధాన (13), సోఫీ డివైన్ (1) విఫలమయ్యారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (53: 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్), రిచా ఘోష్ (62: 37 బంతుల్లో 12 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు.
స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లను కోల్పోయిన బెంగళూరును తొలుత మేఘన ఆదుకుంది. 54 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయిన సమయంలో క్రీజ్లోకి వచ్చిన రిచా ఘోష్తో కలిసి మేఘన కీలక భాగస్వామ్యం నిర్మించింది. వీరిద్దరూ నాలుగో వికెట్కు 71 పరుగులు జోడించారు. దూకుడుగా ఆడే క్రమంలో మేఘన ఔటైంది. ఆ తర్వాత రిచా ఘోష్ వేగం పెంచింది. వరుసగా బౌండరీలతో చెలరేగిపోయింది. అయితే, దీప్తి శర్మ బౌలింగ్లో రిచా బౌల్డయింది. మిగతా ఆర్సీబీ బ్యాటర్లు ఎలీసా పెర్రీ 8, సోఫీ 9*, శ్రేయాంక పాటిల్ 2* పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2.. గ్రేస్ హారిస్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ ఎక్లెస్లోన్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.