Yash Dayal: ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్ దయాల్ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చి తీవ్ర విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ మొదట్లో వరుస పరాజయాలతో డీలాపడిన ఆర్సీబీ.. రెండో దశలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు చేరుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. చెన్నైతో జరిగిన చావోరేవో మ్యాచ్లో 27 పరుగుల తేడాతో గెలిచి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. చెన్నై క్వాలిఫై కావడానికి ఆఖరి ఓవర్లో 17 పరుగులు కొట్టాలి. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ (Yash Dayal)కు అందించడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమనుకున్నారు చాలామంది. అందుకు ఓ కారణం ఉంది. గతేడాది యశ్ దయాల్ గుజరాత్కు ప్రాతినిధ్యం వహించి కోల్కతాతో మ్యాచ్లో చివరి ఓవర్లో ఐదు సిక్స్లు సమర్పించుకుని జట్టు ఓటమికి కారణమయ్యాడు. రింకు సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు. క్రీజులో ధోనీ, జడేజా ఉండటంతో మళ్లీ ఆ సీన్ రిపీట్ అవుతుందేమోనని ఆర్సీబీ ఫ్యాన్స్ కంగారుపడ్డారు. తొలి బంతికే ధోనీ సిక్స్ బాదినా యశ్ దయాల్ ఒత్తిడికి గురికాలేదు. తర్వాతి బంతికే మహీని ఔట్ చేశాడు. తర్వాత నాలుగు బంతుల్లో ఒకే పరుగు ఇచ్చి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. గతేడాది జిరోగా మారిన యశ్ ఈ ఓవర్తో హీరో అయ్యాడు.
2024 సీజన్కు గుజరాత్ యశ్ దయాల్ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. మినీ వేలంలో ఆర్సీబీ యశ్ను రూ.5 కోట్లకు దక్కించుకుంది. దీంతో అతడిని లక్ష్యంగా చేసుకుని మీమ్స్తో నెట్టింట ట్రోల్ చేశారు. యశ్ను తీసుకుని బెంగళూరు రూ.5 కోట్లు వృథా చేసిందంటూ కామెంట్లు, పోస్టులు పెట్టారు. ఇటీవల యశ్ దయాల్ తండ్రి చందర్పాల్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గుజరాత్ టైటాన్స్ తరఫున యశ్ దయాల్ ఒకే ఓవర్లో 5 సిక్స్లు ఇచ్చిన తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న అవమానాల గురించి వివరించారు.
‘‘నేను ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి యశ్ని ఎగతాళి చేస్తూ ఓ మీమ్ని షేర్ చేశాడు. యశ్ ఇచ్చిన ఐదు సిక్సర్లను ప్రస్తావిస్తూ హేళన చేసేలా ఆ మీమ్ ఉంది. నాకు ఇప్పటికీ గుర్తుంది ‘‘ప్రయాగ్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కాకముందే ముగిసింది’’ అని ఆ మీమ్లో రాసుకొచ్చాడు. ఆ ట్రోలింగ్ అంతటితో ఆగిపోలేదు. ఆ ట్రోలింగ్ను భరించలేక మా ఫ్యామిలీ గ్రూప్ మినహా అన్ని వాట్సాప్ గ్రూప్ల నుంచి నిష్క్రమించాం. వేలంలో యశ్ దయాల్ని బెంగళూరు రూ.5 కోట్లకు తీసుకున్నప్పుడు కూడా ట్రోల్ చేశారు. ఆర్సీబీ ఆ డబ్బును మురికి కాలువలో పడేసిందని విమర్శించారు’’ అని చందర్పాల్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..