Ruturaj Gaikwad: గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన చెన్నై ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ స్టేజ్లోనే వెనుదిరిగింది. ఐదో స్థానంతో టోర్నీని ముగించింది. కీలకమైన పోరులో 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 27 పరుగుల తేడాతో సీఎస్కే ఓడింది. కనీసం 201 పరుగులు చేసినా చెన్నై ప్లేఆఫ్స్కు చేరేది. కానీ, 191 పరుగులకే పరిమితం కావడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రుతురాజ్ (0) డకౌట్గా పెవిలియన్కు చేరాడు. బెంగళూరుతో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారిందని రుతురాజ్ (Ruturaj Gaikwad) అభిప్రాయపడ్డాడు. టోర్నీ ఆసాంతం చాలా సవాళ్లను ఎదుర్కొన్నామని పేర్కొన్నాడు.
‘‘పిచ్ స్పిన్నర్లకు సహకరించింది. తేమ పరిస్థితుల్లోనూ వారికి గ్రిప్ దొరికింది. మా ముందున్న లక్ష్యం పెద్దదేమీ కాదు. విజయం సాధిస్తామని భావించాం. నెట్రన్రేట్ను కాపాడుకుంటామని అనుకున్నా సాధ్యపడలేదు. ఈ సీజన్లో కొన్ని మ్యాచులను కొద్దిలో చేజార్చుకున్నాం. అయినా 14 మ్యాచుల్లో ఏడు గెలిచినందుకు ఆనందంగానే ఉంది. కీలకమైన బ్యాటర్లు, బౌలర్లు అందుబాటులో లేరు. డేవన్ కాన్వే సేవలను మిస్ అయ్యాం. పతిరన గాయం కారణంగా కొన్ని మ్యాచులు ఆడలేదు. ముస్తాఫిజుర్ను ఆఖర్లో కోల్పోయాం. గాయాలు, గైర్హాజరీలతో జట్టు సమతూకం లేకుండా పోయింది. ఇవే మా ఓటమికి కారణమని చెప్పను కానీ, ఈ సీజన్లో మాకు ఎదురైన అనుభవాలు ఇవీ. నేనెప్పుడూ వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడను. జట్టు విజయం సాధించిందా? లేదా? అనేదే ముఖ్యం. సీజన్లో 500+ స్కోరు చేసినా రాని ఆనందం జట్టు విజేతగా నిలిస్తే కలుగుతుంది.
ఈసారి మేం ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయినందుకు వ్యక్తిగతంగా చాలా బాధేస్తోంది. గతేడాది ఫైనల్లో మేం చివరి రెండు బంతులకు 10 పరుగులు చేసి ఛాంపియన్గా నిలిచాం. మరోసారి అదే పునరావృతం అవుతుందని ఆశతో ఉన్నా. కానీ యశ్ దయాళ్ చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బంతులేశాడు. కీలకమైన ముగ్గురు ప్లేయర్లు జట్టులో లేకపోయినా మేం ఇంతదాకా పోరాడాం. దీనికి ప్రధాన కారణంగా సీఎస్కే స్టాఫ్. వారి తర్ఫీదులోనే రాటుదేలాం. ’’ అని రుతురాజ్ వెల్లడించాడు. గుజరాత్తో గతేడాది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై బ్యాటర్ రవీంద్ర జడేజా సిక్స్, ఫోర్ కొట్టి జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగడమే తనకు తెలుసునని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?
టీ20 సందడి మళ్లీ మొదలైంది. ఈసారి ప్రపంచ సంగ్రామం. 20 దేశాలు కప్ కోసం తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. వార్మప్ మ్యాచ్లు అయిపోయి ఇప్పటికే తొలి పోరుకు ముగిసింది. ఈ క్రమంలో పిచ్లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనే దానిపై ఓ లుక్కేద్దాం. -
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ రికార్డు ఛేదన చేసి విజయం నమోదు చేసింది. -
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
రెండోసారి టైటిల్ను నెగ్గాలనే లక్ష్యంతో టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగింది. జూన్ 5న తొలి మ్యాచ్లో ఆడనుంది. -
ప్రపంచకప్ కోసం 15 కిలోలు తగ్గి
టీ20 ప్రపంచకప్ కోసం ఉత్సాహంగా సిద్ధమైన టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) మునుపెన్నడూ లేనంత ఫిట్గా కనిపిస్తున్నాడు. -
గంభీర్ మంచి కోచ్ అవుతాడు: గంగూలీ
దరఖాస్తు చేసుకుని ఉంటే టీమ్ఇండియాకు గౌతమ్ గంభీర్ మంచి కోచ్ కాగలడని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
పడిపోదాం పొట్టి కప్పు మాయలో!
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీకి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఇష్టపడే టీ20 ఫార్మాట్లో ప్రపంచకప్ ఆదివారమే శ్రీకారం చుట్టుకోనుంది. -
వార్మప్ భలే..
టీ20 ప్రపంచకప్లో అసలు పోరుకు ముందు టీమ్ఇండియాకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో శనివారం రోహిత్ సేన 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. -
కార్తీక్ గుడ్బై చెప్పేశాడు
అన్ని రకాల పోటీ క్రికెట్కు టీమ్ఇండియా వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అధికారికంగా గుడ్బై చెప్పేశాడు. శనివారం తన 39వ పుట్టిన రోజు సందర్భంగా రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు. -
ఒలింపిక్స్ కోటాకు అడుగు దూరంలో
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాలను సొంతం చేసుకునేందుకు భారత బాక్సర్లు జైస్మిన్, సచిన్ అడుగు దూరంలో నిలిచారు. శనివారం మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ క్వార్టర్స్ చేరింది. -
భారత్ 3.. జర్మనీ 0
ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్ లండన్ అంచెను భారత్ విజయంతో ఆరంభించింది. శనివారం 3-0తో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఓడించింది. -
సబలెంక జోరు
ఫ్రెంచ్ ఓపెన్లో రెండోసీడ్ సబలెంక జోరు మీదుంది. ఆ బెలారస్ అమ్మాయి ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సబలెంక 7-5, 6-1తో పౌలా బదోసా (స్పెయిన్)ను ఓడించింది. -
గాయత్రి జోడీ ఓటమి
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ అద్భుత పోరాటానికి తెరపడింది. -
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
టీ20 ప్రపంచకప్నకు ముందు శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..