Ruturaj Gaikwad: కేఎల్ను అధిగమించి.. భారత ఫాస్టెస్ట్ బ్యాటర్గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అరుదైన ఘనత సాధించాడు. ముంబయిపై కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడు ఐపీఎల్లో రెండు వేల పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై బయటి మైదానాల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబయిపై 20 పరుగుల తేడాతో గెలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో రెండు వేల పరుగుల మైలురాయిని తాకాడు. చెన్నై తరఫున రెండు వేలు అంతకంటే ఎక్కువ చేసిన నాలుగో బ్యాటర్గా నిలిచాడు. రుతురాజ్కు (Ruturaj Gaikwad) ముందు డుప్లెసిస్ (92 మ్యాచుల్లో 2,721 పరుగులు), ఎంఎస్ ధోనీ (226 మ్యాచుల్లో 4,547 ), సురేశ్ రైనా (176 మ్యాచుల్లో 4,687) ఉన్నారు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా సాధించిన తొలి భారత బ్యాటర్గానూ నిలిచాడు. రుతురాజ్ కేవలం 57 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.
ప్రస్తుతం రుతురాజ్ 2,021 పరుగులు పూర్తిచేశాడు. సీఎస్కే తరఫున అతడు 2020లో అరంగేట్రం చేశాడు. మరుసటి సీజన్లో అదరగొట్టాడు. మొత్తం 16 మ్యాచుల్లో 136.26 స్ట్రైక్రేట్తో 635 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ ఏడాది ‘ఆరెంజ్ క్యాప్’ను అందుకొన్నాడు. గతేడాది చెన్నై ఐదోసారి ఛాంపియన్గా నిలవడంలోనూ అతడు కీలక పాత్ర పోషించాడు. మొత్తం 16 మ్యాచుల్లో 590 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడాడు. ఇప్పటి వరకు 224 రన్స్ చేశాడు. వేగంగా రెండు వేల పరుగుల రికార్డులో మొత్తంగా క్రిస్ గేల్ (48 ఇన్నింగ్స్లు), షాన్ మార్ష్ (52 ఇన్నింగ్స్లు) టాప్లో ఉన్నారు. కేఎల్ రాహుల్ (60 ఇన్నింగ్స్లు) ఇప్పటి వరకు భారత్ తరఫున ఈ జాబితాలో టాప్ బ్యాటర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!