IND A vs PAK A: మరోసారి అంపైరింగ్పై తీవ్ర చర్చ.. సాయి సుదర్శన్ ఔటైంది ‘నోబాలా’..?
ఇటీవల అంపైర్ తప్పుడు నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ కప్ ఫైనల్లో(Emerging Asia Cup) సాయి సుదర్శన్(Sai Sudharsan) ఔటైన తీరుపై కూడా ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్ : గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్-ఎ జట్టు.. అసలైన కీలక సమరంలో చేతులెత్తేసింది. ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ కప్ ఫైనల్లో (Emerging Asia Cup Final) పాకిస్థాన్ చేతిలో టీమ్ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. భారత్- A జట్టును 128 పరుగుల తేడాతో పాకిస్థాన్- A ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కూడా టీమ్ఇండియా ఓటమికి కారణమయ్యాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) ఔటైన తీరును వారు ఉదాహరణగా పేర్కొంటున్నారు. నోబాల్ అయినప్పటికీ.. అతడిని ఔట్గా ప్రకటించారని అంపైర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ ఔట్ వివాదాస్పదంగా మారింది.
పాక్ నిర్దేశించిన 353 పరుగుల భారీ ఛేదనకు దిగిన భారత్ ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) 29 పరుగులు చేసి 9వ ఓవర్లో అర్షద్ ఇక్బాల్ బౌలింగ్లో మహమ్మద్ హారిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే.. అది నోబాల్ అని అభిమానులు పేర్కొంటున్నారు. రీప్లేలో బౌలర్ కాలు క్రీజ్ను దాటిందని సోషల్మీడియాలో విమర్శలు చేశారు. అయితే.. థర్డ్ అంపైర్ ఆ బంతిని లీగల్ డెలివరీగా ప్రకటించడం గమనార్హం.
టెస్టుల్లో డబుల్ డిజిట్స్.. తొలి బ్యాటర్గా ‘హిట్మ్యాన్’
సాయి సుదర్శన్ ఔట్ కాకుండా ఉండుంటే.. ఫలితం వేరేలా వచ్చేదని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక టాప్ ఆర్డర్ పెవిలియన్ చేరిన వెంటనే.. మిడిల్ ఆర్డర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో 40 ఓవర్లలోనే భారత్-A 224 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాక్ మొదట 8 వికెట్లకు 352 పరుగుల భారీస్కోరు సాధించింది.
ఇక బంగ్లాదేశ్తో మూడో వన్డేలోనూ అంపైర్ నిర్ణయంపై టీమ్ఇండియా మహిళా క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
ధోనీ-రైనా జోడీ మైదానంలో చెన్నై అభిమానులకు కనువిందు చేసింది. -
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.