IPL 2024: సామ్ కరన్కు 50 శాతం.. డుప్లెసిస్కు రూ. 12 లక్షల ఫైన్
ఆదివారం జరిగిన రెండు మ్యాచుల్లో.. ఇద్దరు కెప్టెన్లకు జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ సామ్ కరన్కు (Sam Curran) ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. గుజరాత్తో మ్యాచ్ సందర్భంగా.. అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో అతడికి ఫైన్ పడింది. ఈ విషయాన్ని ఐపీఎల్ కమిటీ ప్రకటించింది. ‘‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ ఎదుట అంగీకరించాడు. దీంతో అతడికి మ్యాచ్ ఫీజ్లో 50 శాతం ఫైన్గా విధించాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్లో పంజాబ్పై గుజరాత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మేం 15 పరుగులు వెనుకబడ్డాం: కరన్
‘‘స్వల్ప స్కోరును కాపాడేందుకు మా బౌలర్లు చాలా శ్రమించారు. తొలుత బ్యాటింగ్లో కనీసం మరో 15 పరుగులు చేసినా బాగుండేది. మాకే విజయావకాశాలు ఎక్కువగా ఉండేవి. రషీద్, నూర్ అహ్మద్తోపాటు సాయి కిశోర్ను ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ పిచ్పై 160 పరుగులు చేసినా గెలవొచ్చు. ప్రభ్సిమ్రన్ బాగా ఆడాడు. పవర్ ప్లే తర్వాత స్వల్ప వ్యవధిలో వికెట్లు చేజార్చుకోవడం దెబ్బ కొట్టింది. ఇక నుంచి మేం ప్రతి మ్యాచ్లో విజయం సాధించాలి’’ అని కరన్ తెలిపాడు.
స్లో ఓవర్ రేట్ కారణంగా డుప్లెసిస్కు..
కోల్కతాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు స్లో ఓవర్రేట్కు పాల్పడింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు (Faf Duplessis) జరిమానా విధించారు. ఈ సీజన్లో ఇదే తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షలు ఫైన్ను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ప్రకటన జారీ చేసింది. ‘‘లీగ్లో 36వ మ్యాచ్ కోల్కతా-బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి జరిగింది. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్కు జరిమానా విధిస్తున్నాం. మళ్లీ ఇలాంటి తప్పిదం పునరావృతమైతే రెట్టింపు ఫైన్ విధించాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ