Sarfaraz Khan: ఎట్టకేలకు సర్ఫరాజ్ వచ్చేశాడు... సీనియర్ల కంటే స్పెషలేంటి?
ఎట్టకేలకు దేశవాళీ స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్కు (Sarfaraz Khan) భారత జట్టు నుంచి పిలుపొచ్చింది. సీనియర్లను కాదని.. బీసీసీఐ అతడివైపే మొగ్గు చూపింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లూ పెడుతున్నారు.
ఇంగ్లాండ్తో (IND vs ENG) రెండో టెస్టుకు ముందు ఇద్దరు సీనియర్ భారత ఆటగాళ్లు గాయపడ్డారు. ఆ ఇద్దరికి బదులు మళ్లీ సీనియర్లనే తీసుకుంటారని అంతా భావించారు. తీరా.. కేవలం నాలుగు టెస్టులే ఆడిన వాషింగ్టన్ సుందర్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లోకి ఇంకా అడుగు పెట్టని మరో ఇద్దరికి అవకాశం దక్కింది. అందులో ఇప్పుడందరి దృష్టి సర్ఫరాజ్ ఖాన్పైనే (Sarfaraz Khan) పడింది. పుజారా, రహానె వంటి సీనియర్లను కాదని.. ఈ కుర్రాడివైపే బీసీసీఐ (BCCI) మొగ్గు చూపడానికి కారణాలున్నాయి.
దేశవాళీ క్రికెట్లో ఇద్దరు ఆటగాళ్ల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ‘బాగా ఆడుతున్నారు, జాతీయ జట్టులోకి సెలక్ట్ కాలేకపోతున్నారు’ అనేది వాటి సారాంశం. వారిలో ఒకరు పృథ్వీ షా కాగా.. మరొకరు సర్ఫరాజ్ ఖాన్. పృథ్వీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. కొన్ని మ్యాచుల్లో ఫర్వాలేదనిపించినా నిలకడలేమితో బయటకు వచ్చేశాడు. ఆ విషయం పక్కనపెడితే... ఆ రెండో బ్యాటర్ ఇప్పుడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ విషయంలో క్రికెట్ ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నా... సీనియర్లు అందులోనూ దేశవాళీలో అదరగొడుతున్న ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానెను కాదని కొత్త వాళ్లకు ఛాన్స్ ఎందుకు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇదీ సర్ఫరాజ్ ఖాన్ తొలిసారి స్పందన
ఫస్ట్క్లాస్లో సూపర్..
సీనియర్లను కాకుండా కొత్త వాళ్లకే టీమ్ ఇండియా పెద్ద పీట వేస్తోంది అని సమాధానం చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా జట్టు ఎంపికలో బీసీసీఐ ఇలానే ఆలోచిస్తోంది. అయితే ఆ సీనియర్లను కాదనేంత టాలెంట్ సర్ఫరాజ్ దగ్గర ఏముంది అనేది కూడా చర్చనీయాంశమే. రీసెంట్ ఫామ్ చూస్తే... సిరీస్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన అనధికారిక టెస్టులో సెంచరీ (160 బంతుల్లో 161 పరుగులు) చేశాడు. 18 ఫోర్లు, 5 సిక్స్లతో వన్డే తరహాలో శతకం బాదేశాడు. ఆ ఆటకుగాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చూస్తే... 45 మ్యాచుల్లో 3,912 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు (ఒక ట్రిపుల్ సెంచరీ), 11 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి.
2022 రంజీ సీజన్లో 928 పరుగులు చేసిన సర్ఫరాజ్ జాతీయ జట్టుకు రావడం పక్కా అనే మాటలు వినిపించాయి. కానీ అవి ఊహాగానాల వరకే పరిమితమయ్యాయి. టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించే ప్రతి సందర్భంలో సర్ఫరాజ్ పేరు మీడియాలో చర్చకొస్తుంది కానీ సీనియర్ల వల్ల రేసులో వెనుకబడిపోయాడు అని అనేవారు. అయితే ఈసారి టెస్టు క్యాప్కు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. జట్టులో ఖాళీ అయిన రాహుల్ స్థానంలో ఆడాల్సిన బ్యాటర్కు కావాల్సిన లక్షణాలు అన్నీ అతడిలో పుష్కలంగా ఉన్నాయి. భారీ ఇన్నింగ్స్లు, స్పిన్ ట్రాక్ల మీద నిలదొక్కుకోవడం లాంటివి ఇప్పటికే రంజీల్లో చేసి చూపించాడు. అయితే ఫైనల్ XIలో చోటు దక్కి... జోరు మీదున్న ఇంగ్లాండ్ను అడ్డుకుంటే మిగిలిన మూడు టెస్టుల్లో కొనసాగడం పెద్ద విషయం కాదు.
సుందర్, సౌరభ్కు తుది జట్టులో కష్టమేనా?
ఇంగ్లాండ్తో రెండో టెస్టు స్క్వాడ్లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్కు తుది జట్టులో స్థానం కష్టమే. ఇప్పటికే స్పిన్ కోటాలో జడ్డూ లేకపోయినా.. కుల్దీప్ యాదవ్ సిద్ధంగా ఉన్నాడు. సుందర్, సౌరభ్ ఇద్దరూ బ్యాటింగ్తోపాటు స్పిన్ బౌలింగ్ చేయగల సమర్థులే. కానీ, స్పెషలిస్ట్ స్పిన్నర్ జాబితాలో కుల్దీప్ ముందుంటాడు. సౌరభ్ కుమార్ ఇంగ్లాండ్ లయన్స్తో మ్యాచ్లో ఆరు వికెట్లు తీశాడు. మొత్తం 68 ఫస్ట్క్లాస్ మ్యాచుల్లో 290 వికెట్లు తీసిన సౌరభ్.. బ్యాటింగ్లోనూ 2వేలకుపైగా పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే భారత్ తరఫున 5 టెస్టులు ఆడాడు. 2021లో ఇంగ్లాండ్పై ఆడాడు. అప్పుడు నాలుగు టెస్టుల్లో ఆరు వికెట్లే తీశాడు. తాజాగా ఇంగ్లాండ్ లయన్స్పై బ్యాటింగ్లో 57 పరుగులు చేసిన సుందర్ రెండు కీలక వికెట్లూ పడగొట్టాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
ఐపీఎల్-2024లో భాగంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM