Virender Sehwag: రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు.
ఇంటర్నెట్ డెస్క్: పదునైన మాటలతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాజీ క్రికెటర్లలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఒకరు. క్రికెట్ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా తనదైన శైలిలో స్పందించడం సెహ్వాగ్కు అలవాటు. తాజాగా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్తో సాగిన చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ ఇంగ్లిష్ బ్రాడ్కాస్టర్ స్కై స్పోర్ట్స్ నుంచి వచ్చిన ఆఫర్పైనా, బిగ్బాష్ లీగ్లో భారత క్రికెటర్లు ఆడకపోవడానికి గల కారణాలపైనా మాట్లాడాడు.
‘‘నాకు ఒకసారి స్కై స్పోర్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వారి ప్యానెల్లో ఉండాలని కోరింది. అయితే, మీరు నన్ను భరించలేరు అని చెప్పా. ‘అలా కాదు. మీ ధర ఎంతో చెప్పండి’ అని సంస్థ అడిగింది. అయితే, నాకు రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని అడిగా. దానికి ‘అవును మీరు చెప్పింది నిజమే. మేం తట్టుకోలేం’ అని సమాధానం వచ్చింది’’ అని సెహ్వాగ్ తెలిపాడు.
బిగ్బాష్ గురించి..
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్లో భారత క్రికెటర్లు ఎవరూ ఆడకపోవడానికి కారణాలు ఏంటి? అని గిల్క్రిస్ట్ ప్రశ్నించాడు. భారత క్రికెటర్లకు వేరే దేశాల్లో ఆడాల్సిన అవసరం లేదని.. వారి దగ్గర చాలా సంపద ఉందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఈసందర్భంగా బిగ్బాష్కు చెందిన ఓ ఫ్రాంచైజీ నుంచి కూడా ఓ భారీ ఆఫర్ వచ్చిందని దానిని తిరస్కరించినట్లు పేర్కొన్నాడు.
‘‘మాకు డబ్బులు అవసరం లేదు. మేం రిచ్. ఇతర లీగ్ల కోసం పేద దేశాలకు వెళ్లం (నవ్వుతూ). నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. భారత జట్టు నుంచి నన్ను తప్పించారు. ఐపీఎల్లో ఆడుతున్నా. ఆ సమయంలో బిగ్బాష్ లీగ్ నుంచి ఆఫర్ వచ్చింది. నేను అక్కడికి వెళ్తే లక్ష ఆస్ట్రేలియా డాలర్లను ఇవ్వడానికి సిద్ధమని బీబీఎల్ నుంచి సమాధానం వచ్చింది. అంత సొమ్మును కేవలం నా హాలీడేస్ కోసమే వెచ్చిస్తా. గత రాత్రి (అప్పుడు) బిల్ కూడా లక్ష డాలర్ల కంటే ఎక్కువే అయింది’’ అని సెహ్వాగ్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే