Shah Rukh - Gambhir: గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
ఈ సీజన్లో కోల్కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చివరి బంతికి గెలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ స్కోరు సాధించినా కోల్కతాకు మాత్రం విజయం మాత్రం దక్కలేదు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ గెలిచింది. దీంతో కేకేఆర్ మెంటార్గా ఉన్న గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) తీవ్ర నిరాశకు గురయ్యాడు. సహజంగా జట్టు గెలిచినా.. ఓడినా ప్రదర్శన గురించి కోచ్ లేదా మెంటార్ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడతారు. కానీ, తన జట్టు ప్లేయర్లలో ఉత్సాహం తెచ్చేందుకు కోల్కతా సహ యజమాని షారుఖ్ఖాన్ డ్రెస్సింగ్ రూమ్కు వచ్చాడు. ఆట గురించి మాట్లాడిన తర్వాత మెంటార్ గంభీర్ను నవ్వించేందుకు ప్రయత్నించాడు. ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
‘‘జీవితంలో మరీ ముఖ్యంగా ఆటల్లో గెలుపోటములు సహజం. రెండింటినీ సమానంగా స్వీకరించేలా ఉండాలి. రాజస్థాన్పై అద్భుతంగా ఆడారు. మనం ఓడిపోయామని అనుకోవడం లేదు. చివరివరకూ పోరాడటం ఎప్పటికీ గర్వకారణమే. అందుకే, ఎవరూ బాధపడొద్దు. నిరుత్సాహానికి గురి కావద్దు. డ్రెస్సింగ్ రూమ్కు వచ్చాక ఆ బాధ నుంచి బయటకు రావాలి. ఎప్పుడూ ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ ఉంది. మైదానంలో, బయట ఇదే ఉత్సాహంతో ముందుకుసాగాలి. ప్రతీ ఒక్కరితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎవరూ దీనిని ఓటమిగా భావించొద్దు. మన ఆటపై గర్వంగా ఉండాలి. గౌతమ్ గంభీర్ అలా డీలా పడొద్దు. కాస్త నవ్వుతూ ఉండు. తప్పకుండా బలం పుంజుకొంటామనే నమ్మకం నాకుంది. ఇదంతా దేవుడి ప్రణాళిక అనుకోవాలి. మున్ముందు మరిన్ని విజయాలకు నాంది కావాలి’’ అని షారుఖ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?