Shahid Afridi: కెప్టెన్సీ ఇచ్చారు సరే.. టైమూ ఇవ్వాలి కదా.. అల్లుడిని వెనకేసుకొచ్చిన షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి ఫైర్ అయ్యాడు. తన అల్లుడు షహీన్ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే కథనాల నేపథ్యంలో స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గత వన్డే వరల్డ్ కప్ తర్వాత తమ జట్టు కెప్టెన్సీలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మార్పులు చేసింది. బాబర్ అజామ్ను తొలగించి టీ20 జట్టు సారథిగా షహీన్ అఫ్రిదిని నియమించింది. టెస్టు జట్టు బాధ్యతలను షాన్ మసూద్కు అప్పగించింది. వన్డే టీమ్కు ఎవరినీ ఎంపిక చేయలేదు. అయితే, ఇప్పుడు షహీన్ను సారథ్యం నుంచి తొలగించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈక్రమంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తన అల్లుడిని వెనకేసుకొచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరును ఆక్షేపిస్తూ విమర్శలు గుప్పించాడు. ఎవరినైనా ఎంపిక చేసినప్పుడు తగినంత సమయం ఇవ్వాలని హితవు పలికాడు.
‘‘మీరు (బోర్డును ఉద్దేశించి) ఎవరికైనా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పుడు వారు కుదురుకోవడానికి సమయం కూడా ఇవ్వాలి. కానీ, పాక్ క్రికెట్లో అతి పెద్ద సమస్య ఏంటంటే.. బోర్డులోని పెద్దలు మారినప్పుడుల్లా పద్ధతి మారిపోతుంటుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా దేశ క్రికెట్కు మంచి కోసం ఆలోచనలు చేయాలి. మీరు గతంలో కెప్టెన్ను మార్చాలని భావించారు. అందుకోసం షహీన్ను సారథిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ అతడిని మార్చాలని భావిస్తున్నారు. అసలు తప్పు ఎక్కడ ఉంది? అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం పొరపాటా? ఇప్పుడు ఇలాంటి సమయంలో మార్చాలనుకోవడం తప్పా? మీరే తేల్చుకోవాలి.
పాక్ జట్టుకు ప్రధాన కోచ్గా విదేశీ ఆటగాడి నియామకంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, అతడి ట్రాక్ రికార్డు మాత్రం బాగుండాలి. అప్పుడే మన ఆటగాళ్లందరూ అతడితో కలిసి పని చేస్తారని ఆశిస్తున్నా. సీనియర్ క్రికెటర్లు ఇమాద్ వాసిమ్, మహమ్మద్ అమిర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే, వారిద్దరూ తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. కాకుల్లో జరిగే రెండు వారాల ట్రైనింగ్ క్యాంప్లో రాటుదేలితే మాత్రం వారిద్దరూ సూపర్ మ్యాన్లు అవుతారు. ప్రస్తుతం ఉన్న టీ20 కెప్టెన్సీ ఫర్వాలేదు. తప్పకుండా అతడి సత్తాను నిరూపించుకొనేందుకు గడువు ఇవ్వాల్సిందే’’ అని షాహిద్ వ్యాఖ్యానించాడు. వచ్చే జూన్ నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో కెప్టెన్సీ మార్పు చేస్తే జట్టు ప్రదర్శనపైనా ప్రభావం పడే అవకాశం ఉందనేది కొందరు మాజీల వాదన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం