Shahid Afridi: కెప్టెన్సీ ఇచ్చారు సరే.. టైమూ ఇవ్వాలి కదా.. అల్లుడిని వెనకేసుకొచ్చిన షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి ఫైర్ అయ్యాడు. తన అల్లుడు షహీన్ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే కథనాల నేపథ్యంలో స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గత వన్డే వరల్డ్ కప్ తర్వాత తమ జట్టు కెప్టెన్సీలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మార్పులు చేసింది. బాబర్ అజామ్ను తొలగించి టీ20 జట్టు సారథిగా షహీన్ అఫ్రిదిని నియమించింది. టెస్టు జట్టు బాధ్యతలను షాన్ మసూద్కు అప్పగించింది. వన్డే టీమ్కు ఎవరినీ ఎంపిక చేయలేదు. అయితే, ఇప్పుడు షహీన్ను సారథ్యం నుంచి తొలగించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈక్రమంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తన అల్లుడిని వెనకేసుకొచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరును ఆక్షేపిస్తూ విమర్శలు గుప్పించాడు. ఎవరినైనా ఎంపిక చేసినప్పుడు తగినంత సమయం ఇవ్వాలని హితవు పలికాడు.
‘‘మీరు (బోర్డును ఉద్దేశించి) ఎవరికైనా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పుడు వారు కుదురుకోవడానికి సమయం కూడా ఇవ్వాలి. కానీ, పాక్ క్రికెట్లో అతి పెద్ద సమస్య ఏంటంటే.. బోర్డులోని పెద్దలు మారినప్పుడుల్లా పద్ధతి మారిపోతుంటుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా దేశ క్రికెట్కు మంచి కోసం ఆలోచనలు చేయాలి. మీరు గతంలో కెప్టెన్ను మార్చాలని భావించారు. అందుకోసం షహీన్ను సారథిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ అతడిని మార్చాలని భావిస్తున్నారు. అసలు తప్పు ఎక్కడ ఉంది? అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం పొరపాటా? ఇప్పుడు ఇలాంటి సమయంలో మార్చాలనుకోవడం తప్పా? మీరే తేల్చుకోవాలి.
పాక్ జట్టుకు ప్రధాన కోచ్గా విదేశీ ఆటగాడి నియామకంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, అతడి ట్రాక్ రికార్డు మాత్రం బాగుండాలి. అప్పుడే మన ఆటగాళ్లందరూ అతడితో కలిసి పని చేస్తారని ఆశిస్తున్నా. సీనియర్ క్రికెటర్లు ఇమాద్ వాసిమ్, మహమ్మద్ అమిర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే, వారిద్దరూ తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. కాకుల్లో జరిగే రెండు వారాల ట్రైనింగ్ క్యాంప్లో రాటుదేలితే మాత్రం వారిద్దరూ సూపర్ మ్యాన్లు అవుతారు. ప్రస్తుతం ఉన్న టీ20 కెప్టెన్సీ ఫర్వాలేదు. తప్పకుండా అతడి సత్తాను నిరూపించుకొనేందుకు గడువు ఇవ్వాల్సిందే’’ అని షాహిద్ వ్యాఖ్యానించాడు. వచ్చే జూన్ నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో కెప్టెన్సీ మార్పు చేస్తే జట్టు ప్రదర్శనపైనా ప్రభావం పడే అవకాశం ఉందనేది కొందరు మాజీల వాదన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్