Shami: గాయం నుంచి కోలుకోని షమి.. జట్టులోకి వచ్చేది ఎప్పటికో!
నాలుగు నెలల కిందట గాయపడిన షమీ (Shami) ఇంకా కోలుకోలేదు. అతడు ఎప్పుడు ఫిట్నెస్ సాధిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
వన్డే ప్రపంచకప్లో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి అద్భుత ప్రదర్శనతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ కప్ ముగిసిన తర్వాత చాలారోజులు మైదానంలో కనబడలేదు. గాయపడిన మిగిలిన క్రికెటర్లంతా ఒక్కొక్కరుగా పునరాగమనం చేస్తుంటే షమి పునరాగమనం మరింత వెనక్కిపోతోంది. తాజాగా ఐపీఎల్లో కూడా ఆడటం లేదు. గాయం ఇంకా తగ్గకపోవడమే ఇందుకు కారణం. ఎప్పుడు కోలుకొని వస్తాడనేది అనుమానంగా ఉంది..
అసలేం జరిగింది..
ప్రపంచకప్లో షమికి చీలమండకు గాయమైంది. గాయం వేధిస్తుండగానే అతడు కొన్ని మ్యాచ్లు ఆడినట్లు తెలిసింది. దీంతో దీని తీవ్రత ఎక్కువైంది. ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత చికిత్స తీసుకోవడానికి ఈ పేసర్ లండన్ వెళ్లాడు. అక్కడే మూడు వారాలు ట్రీట్మెంట్ చేయించుకుని తిరిగి వచ్చేసి మళ్లీ సాధన మొదలుపెట్టాలని భావించాడు. అయితే నొప్పిని తగ్గించే ప్రక్రియలో భాగంగా షమికి చేసిన ఇంజెక్షన్లు సరిగా పని చేయలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. సాధన సంగతి పక్కనపెట్టి ముందు గాయాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాడు. లండన్లోనే చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. మార్చి 22న ఆరంభమయ్యే ఐపీఎల్-17కి ఈ బౌలర్ దూరమవుతున్నట్లు అధికారికంగా ప్రకటనా వెలువడింది. ఈ పరిణామం గుజరాత్ టైటాన్స్కు పెద్ద ఎదురుదెబ్బే. గతేడాది 17 మ్యాచ్ల్లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న షమి.. గుజరాత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్య ముంబయికి వెళ్లిపోవడంతో ఢీలా పడ్డ గుజరాత్కు షమి కూడా లేకపోవడం ఇంకా కష్టమే.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోనైనా..
ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికాతో కీలక పర్యటనలో షమి కచ్చితంగా ఉంటాడనుకుంటే ఆ ఆశ తీరలేదు. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్తో పెద్ద సిరీస్లోనూ ఆడలేకపోయాడు. ప్రపంచకప్ సందర్భంగా అయిన గాయం చిన్నదే ఇంజెక్షన్ల ద్వారా తగ్గిపోతుందని భావించిన అతడు ఎక్కువ దానిపై దృష్టిపెట్టనట్లు సమాచారం. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది. కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్-గావస్కర్ సిరీస్లోనైనా అతడు ఆడితే భారత్కు అదే పదివేలు. దానికంటే ముందు అక్టోబర్లో బంగ్లాదేశ్తో, నవంబర్లో న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లకు ఈ పేసర్ అందుబాటులో ఉండాలని జట్టు కోరుకుంటోంది. కానీ శస్త్ర చికిత్స తర్వాత.. కోలుకునే సమయాన్ని బట్టి షమి రాక ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్లలో ఆడకపోతే నవంబర్లో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసమైనా షమి వస్తాడా అనేది చూడాలి. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్లలో భారత్ చరిత్రాత్మక విజయాలు సాధించింది. ఈసారీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్తో సీనియర్లు దూరం కావడంతో భారత బౌలింగ్ దాడిలో పదును లోపించింది. స్పిన్ పిచ్లు కాబట్టి ఒకే పేసర్తో మేనేజ్ చేస్తూ టీమ్ఇండియా బండి లాగించింది. కానీ ఆస్ట్రేలియా లాంటి ప్రధాన సిరీస్లలో షమి లాంటి పేసర్ సేవలు అత్యవరం. టీమ్ఇండియా ఇంజూరీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడంతో షమితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా తరచూ గాయాల కారణంగా జట్టుకు దూరమమవుతున్నాడు. రంజీల్లో ఆడి ఫిట్నెస్, సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నా.. యువ ఆటగాళ్లు పెడ చెవినపెడుతున్నారు. ఇలాంటి విషయాలను బోర్డు సీరియస్గా తీసుకోకపోతే కీలక సిరీస్లకు ఇలా ప్రధాన ఆటగాళ్లు దూరం అవుతూనే ఉంటారు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్