Shami: గాయం నుంచి కోలుకోని షమి.. జట్టులోకి వచ్చేది ఎప్పటికో!
నాలుగు నెలల కిందట గాయపడిన షమీ (Shami) ఇంకా కోలుకోలేదు. అతడు ఎప్పుడు ఫిట్నెస్ సాధిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
వన్డే ప్రపంచకప్లో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి అద్భుత ప్రదర్శనతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ కప్ ముగిసిన తర్వాత చాలారోజులు మైదానంలో కనబడలేదు. గాయపడిన మిగిలిన క్రికెటర్లంతా ఒక్కొక్కరుగా పునరాగమనం చేస్తుంటే షమి పునరాగమనం మరింత వెనక్కిపోతోంది. తాజాగా ఐపీఎల్లో కూడా ఆడటం లేదు. గాయం ఇంకా తగ్గకపోవడమే ఇందుకు కారణం. ఎప్పుడు కోలుకొని వస్తాడనేది అనుమానంగా ఉంది..
అసలేం జరిగింది..
ప్రపంచకప్లో షమికి చీలమండకు గాయమైంది. గాయం వేధిస్తుండగానే అతడు కొన్ని మ్యాచ్లు ఆడినట్లు తెలిసింది. దీంతో దీని తీవ్రత ఎక్కువైంది. ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత చికిత్స తీసుకోవడానికి ఈ పేసర్ లండన్ వెళ్లాడు. అక్కడే మూడు వారాలు ట్రీట్మెంట్ చేయించుకుని తిరిగి వచ్చేసి మళ్లీ సాధన మొదలుపెట్టాలని భావించాడు. అయితే నొప్పిని తగ్గించే ప్రక్రియలో భాగంగా షమికి చేసిన ఇంజెక్షన్లు సరిగా పని చేయలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. సాధన సంగతి పక్కనపెట్టి ముందు గాయాన్ని తగ్గించుకోవడంపై దృష్టి సారించాడు. లండన్లోనే చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. మార్చి 22న ఆరంభమయ్యే ఐపీఎల్-17కి ఈ బౌలర్ దూరమవుతున్నట్లు అధికారికంగా ప్రకటనా వెలువడింది. ఈ పరిణామం గుజరాత్ టైటాన్స్కు పెద్ద ఎదురుదెబ్బే. గతేడాది 17 మ్యాచ్ల్లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న షమి.. గుజరాత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్య ముంబయికి వెళ్లిపోవడంతో ఢీలా పడ్డ గుజరాత్కు షమి కూడా లేకపోవడం ఇంకా కష్టమే.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలోనైనా..
ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికాతో కీలక పర్యటనలో షమి కచ్చితంగా ఉంటాడనుకుంటే ఆ ఆశ తీరలేదు. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్తో పెద్ద సిరీస్లోనూ ఆడలేకపోయాడు. ప్రపంచకప్ సందర్భంగా అయిన గాయం చిన్నదే ఇంజెక్షన్ల ద్వారా తగ్గిపోతుందని భావించిన అతడు ఎక్కువ దానిపై దృష్టిపెట్టనట్లు సమాచారం. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శస్త్రచికిత్స అనివార్యమైంది. కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్-గావస్కర్ సిరీస్లోనైనా అతడు ఆడితే భారత్కు అదే పదివేలు. దానికంటే ముందు అక్టోబర్లో బంగ్లాదేశ్తో, నవంబర్లో న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లకు ఈ పేసర్ అందుబాటులో ఉండాలని జట్టు కోరుకుంటోంది. కానీ శస్త్ర చికిత్స తర్వాత.. కోలుకునే సమయాన్ని బట్టి షమి రాక ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ సిరీస్లలో ఆడకపోతే నవంబర్లో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ కోసమైనా షమి వస్తాడా అనేది చూడాలి. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్లలో భారత్ చరిత్రాత్మక విజయాలు సాధించింది. ఈసారీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఇంగ్లాండ్తో సీనియర్లు దూరం కావడంతో భారత బౌలింగ్ దాడిలో పదును లోపించింది. స్పిన్ పిచ్లు కాబట్టి ఒకే పేసర్తో మేనేజ్ చేస్తూ టీమ్ఇండియా బండి లాగించింది. కానీ ఆస్ట్రేలియా లాంటి ప్రధాన సిరీస్లలో షమి లాంటి పేసర్ సేవలు అత్యవరం. టీమ్ఇండియా ఇంజూరీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడంతో షమితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా తరచూ గాయాల కారణంగా జట్టుకు దూరమమవుతున్నాడు. రంజీల్లో ఆడి ఫిట్నెస్, సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నా.. యువ ఆటగాళ్లు పెడ చెవినపెడుతున్నారు. ఇలాంటి విషయాలను బోర్డు సీరియస్గా తీసుకోకపోతే కీలక సిరీస్లకు ఇలా ప్రధాన ఆటగాళ్లు దూరం అవుతూనే ఉంటారు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి