Shreyas Iyer: చెపాక్ను అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాం : శ్రేయస్ అయ్యర్
ఓటమి నుంచి గుణపాఠాలను నేర్చుకొని ముందుకుసాగుతామని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వ్యాఖ్యానించాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 7 వికెట్ల తేడాతో ఓడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతాకు తొలి ఓటమి ఎదురైంది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతాపై చెన్నై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా మారడంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 137/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. తొలి బంతికే వికెట్ను కోల్పోయిన కోల్కతా పవర్ప్లేలో మాత్రం 56 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత మాత్రం స్వల్ప వ్యవధుల్లో వికెట్లను కోల్పోయి ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని.. పిచ్ను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే భారీ స్కోరు చేసే అవకాశం చేజారిందని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వ్యాఖ్యానించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశాడు. కనీసం మరో 30 పరుగులు చేసినా ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదని పేర్కొన్నాడు.
‘‘పవర్ప్లేలో మంచి స్కోరు చేశాం. ఆ ఊపును కొనసాగించడంలో విఫలం కావడం నిరాశపరిచింది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ను అంచనా వేయడంలో ఇబ్బందిపడ్డాం. వికెట్లను చేజార్చుకోవడంతో ప్రత్యర్థిపై భారీగా లక్ష్యం నిర్దేశించలేకపోయాం. త్వరగా పిచ్ పరిస్థితికి తగ్గట్టుగా ప్రణాళికలను మార్చలేదు. ఇక్కడ పరుగులు చేయడం చాలా కష్టమని ఆలస్యంగా అర్థం చేసుకున్నాం. చెన్నైకి పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసు. వారి ప్రణాళికలు కూడా పక్కాగా అమలుచేయగలిగారు. హార్డ్ హిట్టర్లకూ భారీ షాట్లు కొట్టడం తేలికేం కాదు. ఇన్నింగ్స్ నిర్మాణంపై దృష్టిపెట్టలేకపోయాం. తప్పకుండా ఓటమి నుంచి నేర్చుకుంటాం. ఇప్పుడు కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓడిపోయాం. తదుపరి మ్యాచుల్లో దృఢంగా బరిలోకి దిగుతాం’’ అని శ్రేయస్ తెలిపాడు.
కనీసం 160 పరుగులు చేసుంటే..: వరుణ్ చక్రవర్తి
‘‘మ్యాచ్కు ముందు పిచ్ను చూస్తే చాలా ఫ్లాట్గా అనిపించింది. పరుగులు ఈజీగా రాబట్టొచ్చని భావించా. కానీ, మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ తీరు పూర్తిగా మారిపోయింది. మేం ఇంకాస్త ఉత్తమంగా అంచనా వేస్తే బాగుండేది. పిచ్ చాలా నెమ్మదించింది. బంతిని కనెక్ట్ చేయడం చాలా కష్టం. కనీసం 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ను గెలిచే అవకాశం ఉండేది. మంచు ప్రభావం కూడా మా బౌలింగ్పై ప్రభావం చూపింది. శివమ్ దూబెకు ఓవర్ వేస్తుంటే బంతిపై నియంత్రణ కూడా సాధ్యం కాలేదు. ప్రతీ బ్యాటర్కు ఒక్కో ప్రణాళికతో బరిలోకి దిగుతాం. వాటిని సరిగ్గా అమలుచేయగలిగితే వికెట్ దక్కుతుంది. ప్రతీ జట్టులోని కొందరు బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. వారికి కౌంటర్గా బంతులేయడంపై దృష్టిసారిస్తా’’ అని కోల్కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం