Kolkata vs Rajasthan: నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 16న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. జోస్ బట్లర్ (107 నాటౌట్; 60 బంతుల్లో 9×4, 6×6) చెలరేగడంతో రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో కోల్కతాను ఓడించింది. సునీల్ నరైన్ (Sunil Narine) (109; 56 బంతుల్లో 13×4, 6×6) విధ్వంసకర శతకంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సంజు సేన 8 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఆఖరు బంతిని ఛేదించి ఈ సీజన్లో ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో సునీల్ నరైన్ చేసిన శతకం వృథా అయినా అతడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ బాదడంతోపాటు హ్యాట్రిక్ వికెట్ల ఘనత అందుకున్న మూడో క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ మాత్రమే ఇదివరకు ఈ రికార్డు నెలకొల్పారు. ఈ విండీస్ మాంత్రికుడు 2013లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ హస్సీ, గుర్కీత్ సింగ్, అజామ్ మహమూద్ను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.
రోహిత్ హ్యాట్రిక్ ఎప్పుడంటే?
ఐపీఎల్ ఆరంభంలో కొన్ని సీజన్ల పాటు రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2009లో ఆ జట్టు తరఫున ముంబయిపై హ్యాట్రిక్ సాధించాడు. అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్, జేపీ డుమినిలను పెవిలియన్కు పంపి ఈ ఫీట్ అందుకున్నాడు. కొన్నాళ్లకు ముంబయి జట్టుకు మారిన రోహిత్ శర్మ 2012లో కోల్కతాపై సెంచరీ చేశాడు. ఐపీఎల్ 17 సీజన్లో ఇటీవల చెన్నైపై అతడు మూడంకెల స్కోరు అందుకుని రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక షేన్ వాట్సన్ విషయానికి వస్తే అతడు చెన్నై, కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్లపై సెంచరీలు సాధించాడు. ఈ ఆసీస్ ఆల్రౌండర్ 2014లో రాజస్థాన్ తరఫున ఆడుతూ హైదరాబాద్పై హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. శిఖర్ ధావన్, మోయిసెస్ హెన్రిక్స్, కర్ణ్ శర్మలను ఔట్ చేసి ఈ ఫీట్ అందుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఈ సీజన్లో ఆ జట్టు స్లో ఓవర్రేట్ నమోదు ఇదే తొలిసారి కావడంతో జరిమానాతో సరిపెట్టారు. మరోసారి ఇది పునరావృతం అయితే కెప్టెన్కు రూ.24 లక్షల ఫైన్తోపాటు ఇంపాక్ట్ ప్లేయర్తో సహా తుది జట్టులోని 11 మందికి రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్ ఫీజ్లో 25 శాతం ఏది తక్కువైతే అది.. జరిమానాగా విధిస్తారు. మూడోసారి తప్పిదానికి పాల్పడితే రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. ఈ సీజన్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ స్లో ఓవర్రేట్ కారణంగా రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు