Kolkata vs Rajasthan: నరైన్ అరుదైన రికార్డు.. శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షల జరిమానా విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 16న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ చివరి బంతికి విజయం సాధించింది. జోస్ బట్లర్ (107 నాటౌట్; 60 బంతుల్లో 9×4, 6×6) చెలరేగడంతో రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో కోల్కతాను ఓడించింది. సునీల్ నరైన్ (Sunil Narine) (109; 56 బంతుల్లో 13×4, 6×6) విధ్వంసకర శతకంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సంజు సేన 8 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ఆఖరు బంతిని ఛేదించి ఈ సీజన్లో ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో సునీల్ నరైన్ చేసిన శతకం వృథా అయినా అతడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ బాదడంతోపాటు హ్యాట్రిక్ వికెట్ల ఘనత అందుకున్న మూడో క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ మాత్రమే ఇదివరకు ఈ రికార్డు నెలకొల్పారు. ఈ విండీస్ మాంత్రికుడు 2013లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో డేవిడ్ హస్సీ, గుర్కీత్ సింగ్, అజామ్ మహమూద్ను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.
రోహిత్ హ్యాట్రిక్ ఎప్పుడంటే?
ఐపీఎల్ ఆరంభంలో కొన్ని సీజన్ల పాటు రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 2009లో ఆ జట్టు తరఫున ముంబయిపై హ్యాట్రిక్ సాధించాడు. అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్, జేపీ డుమినిలను పెవిలియన్కు పంపి ఈ ఫీట్ అందుకున్నాడు. కొన్నాళ్లకు ముంబయి జట్టుకు మారిన రోహిత్ శర్మ 2012లో కోల్కతాపై సెంచరీ చేశాడు. ఐపీఎల్ 17 సీజన్లో ఇటీవల చెన్నైపై అతడు మూడంకెల స్కోరు అందుకుని రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక షేన్ వాట్సన్ విషయానికి వస్తే అతడు చెన్నై, కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్లపై సెంచరీలు సాధించాడు. ఈ ఆసీస్ ఆల్రౌండర్ 2014లో రాజస్థాన్ తరఫున ఆడుతూ హైదరాబాద్పై హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. శిఖర్ ధావన్, మోయిసెస్ హెన్రిక్స్, కర్ణ్ శర్మలను ఔట్ చేసి ఈ ఫీట్ అందుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్ నమోదు చేసినందుకు కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు ఐపీఎల్ నిర్వాహకులు రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఈ సీజన్లో ఆ జట్టు స్లో ఓవర్రేట్ నమోదు ఇదే తొలిసారి కావడంతో జరిమానాతో సరిపెట్టారు. మరోసారి ఇది పునరావృతం అయితే కెప్టెన్కు రూ.24 లక్షల ఫైన్తోపాటు ఇంపాక్ట్ ప్లేయర్తో సహా తుది జట్టులోని 11 మందికి రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్ ఫీజ్లో 25 శాతం ఏది తక్కువైతే అది.. జరిమానాగా విధిస్తారు. మూడోసారి తప్పిదానికి పాల్పడితే రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. ఈ సీజన్లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ స్లో ఓవర్రేట్ కారణంగా రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.