Shreyas Iyer: శ్రీలంకపై ఆటను చూసే మీరు అలాంటి ప్రశ్న అడిగారా? ‘షార్ట్బాల్’ బలహీనతపై శ్రేయస్ అసహనం
శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్ను (Shreyas Iyer) ఓ ప్రశ్న అసహనానికి గురి చేసింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) తుది జట్టులో తన స్థానంపై అనుమానాలు ఏర్పడిన సమయంలో శ్రీలంకపై భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 56 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్స్లు ఉన్నాయి. ఈ మ్యాచ్కు ముందు వరకు షార్ట్ బాల్స్ను ఆడే క్రమంలో ఔటై పెవిలియన్కు చేరిన సందర్భాలే ఎక్కువ. అయితే, ఈసారి మాత్రం అలాంటి బంతులను కూడా.. బౌండరీలుగా మలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ విలేకరి ప్రశ్నకు శ్రేయస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్న అడగడం సరైందేనా..? అని అయ్యర్ ప్రశ్నించడం విశేషం. ఇరువురి మధ్య సంభాషణ ఇలా..
రిపోర్టర్: వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి ‘షార్ట్ బాల్స్’ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇవాళ కొన్ని అద్భుత పుల్ షాట్లు కొట్టారు. తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో మీరు తలపడనున్నారు. ఆ జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారు. షార్ట్ బాల్స్ను ఎదుర్కొనేందుకు మీరెలా సన్నద్ధమయ్యారు?
శ్రేయస్: ఇది నాకు సమస్య అని మీరు చెప్పడం వెనుక మీ ఉద్దేశం ఏంటి?
రిపోర్టర్: అంటే సమస్య అని కాదు. కానీ, మీరు ఇబ్బంది పడుతున్నారు కదా..
శ్రేయస్ అయ్యర్: నాకు ఇబ్బందా? నేను పుల్ షాట్లతో ఎన్ని పరుగులు సాధించానో మీరు చూశారా? మరీ ముఖ్యంగా నలుగురు బ్యాటర్లు ఔటైనప్పుడు కూడా అలాంటి షాట్లు ఆడి పరుగులు రాబట్టాను.
ఆ తర్వాత తన ప్రెస్ మీట్ను కొనసాగిస్తూ శ్రేయస్ మాట్లాడాడు. ‘‘గాయాల నుంచి కోలుకుని వచ్చాక ఆడటం ఎప్పుడైనా సవాలే. ఫీల్డింగ్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది. గాయం నుంచి కోలుకుని వచ్చిన తొలి రోజుల్లో కదలడానికి కూడా ఇబ్బంది పడ్డా. అయితే, ట్రైనర్స్, ఫిజియో ఇచ్చిన మద్దతుతో చురుగ్గా మారా. 50 ఓవర్ల పాటు క్రికెట్ ఆడటం తేలికైన విషయం కాదు. శరీరంపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్లను మా బౌలర్లు కట్టడి చేసిన తీరు అద్భుతం. అదృష్టవశాత్తూ మేం వీరితో తలపడే అవకాశం లేదు. అయితే, వారిని కొన్నిసార్లు నెట్స్లో ఎదుర్కొంటుంటాం. ఆ పేస్ దాడిపై ఆడటం ఎవరికైనా కఠిన సవాల్. ఈ మ్యాచ్లో విజయం సాధించడం వెనుక భారత బౌలర్లదే కీలక పాత్ర’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం