Shreyas Iyer: ‘అప్పుడు ఓ అందమైన అమ్మాయిని చూశా..’: టీవీ షోలో శ్రేయస్ అయ్యర్‌ వెల్లడి

భారత యువ క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్(Shreyas Iyer) తన జీవితంలో జరిగిన ఓ అనుభవాన్ని వెల్లడించారు. 

Updated : 09 Apr 2024 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఇటీవల కమెడియన్‌ కపిల్‌ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్‌-శ్రేయస్ మధ్య సరదా సంభాషణ జరిగింది.

ఈ యువ క్రికెటర్ బౌండరీ బాదినప్పుడల్లా.. ‘శ్రేయస్ మ్యారీ మీ’ అంటూ పోస్టర్లు పట్టుకున్న అమ్మాయిల వైపు కెమెరామెన్ ఫోకస్ చేస్తాడంటూ కపిల్ సరదాగా మాట్లాడారు. తర్వాత ఆ అమ్మాయిల గురించి ఆరా తీశారా..? అని ప్రశ్నించారు. దానికి ఈ యువ బ్యాటర్‌ స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్‌ మొదటిసారి ఆడుతున్నప్పుడు.. స్టాండ్స్‌లో ఒక అందమైన అమ్మాయిని చూశాను. ఆమెకు హలో కూడా చెప్పాను. ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతోంది. అప్పట్లో ఫేస్‌బుక్‌ చాలా పాపులర్. తర్వాత ఆమె నుంచి సమాధానం వస్తుందని ఆశించాను. తరచూ మెసేజ్‌లు చూసుకునేవాడిని. నాకు ఎదురైన ఒకే ఒక్క అనుభవం అది’’ అంటూ బదులిచ్చాడు.

ఈ షోకు రోహిత్‌, శ్రేయస్‌ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రూమ్‌ షేర్‌ చేసుకొనే అవకాశం వస్తే ఎవరితో కలిసి ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తారనే ప్రశ్న హిట్‌మ్యాన్‌కు ఎదురైంది. తాను శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌తో మాత్రం కలిసుండనని, వాళ్లు గదిని చాలా మురికిగా ఉంచుతారని చెప్పారు. ఇదిలాఉంటే..ఈ ఐపీఎల్‌లో కోల్‌కతాకు శ్రేయస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని