Yashasvi - Gil: ఇది ఆరంభం మాత్రమేనన్న యశస్వి.. గత మ్యాచుల్లో పొరపాట్లేమీ చేయలేదన్న గిల్!
భారత యువ క్రికెటర్లు విండీస్పై (WI vs IND) నాలుగో టీ20లో అదరగొట్టారు. సిరీస్ రేసులో నిలవాలంటే విజయం సాధించాల్సిన మ్యాచ్లో రాణించారు. దీంతో 2-2తో సమంగా నిలిచిన ఇరు జట్లూ ఫైనల్లాంటి ఐదో మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో (WI vs IND) తొలి మూడు టీ20ల్లో 3, 7, 6 పరుగులు చేసిన భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) కీలకమైన నాలుగో మ్యాచ్లో మాత్రం చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ (77) చేసి ఫామ్లోకి వచ్చిన గిల్ గత మూడు మ్యాచుల్లో విఫలం కావడంపై స్పందించాడు. యశస్వి జైస్వాల్తో కలిసి 165 పరుగులు జోడించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించాడు.
టీమ్ఇండియా ‘హ్యాట్రిక్’ కొట్టాలి.. టీ20 సిరీస్ పట్టేయాలి!
‘‘తొలి మూడు మ్యాచుల్లో కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయా. నాలుగో టీ20 జరిగిన ఫ్లోరిడా పిచ్ కాస్త బెటర్గా ఉంది. దానిని ఉపయోగించుకోవాలని భావించా. మంచి ఆరంభం దక్కడంతో మ్యాచ్ను కూడా ముగించాలని అనుకున్నా. టీ20 క్రికెట్లో ఉండే వైవిధ్యం ఇదే. ఓ మూడు లేదా నాలుగు మ్యాచుల్లో వేగంగా పరుగులు చేసే క్రమంలో.. ప్రత్యర్థి ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్లు పడితే పెవిలియన్కు చేరక తప్పదు. ఎక్కువగా ఆలోచించి ఆడటానికి పొట్టి ఫార్మాట్లో సమయం ఉండదు. అయితే, ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఆడటం చాలా ముఖ్యం. తప్పులు ఎక్కడ జరిగాయనేది తెలుసుకోగలిగితే పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. అయితే, తొలి మూడు మ్యాచుల్లో పొరపాట్లు ఎక్కడా చేయలేదు. ఆరంభాలను మంచి స్కోర్లుగా మలచలేకపోయా. యశస్వి జైస్వాల్తో కలిసి భారీ ఇన్నింగ్స్ ఆడటం బాగుంది’’ అని గిల్ తెలిపాడు.
ఎంతో ప్రత్యేకం: యశస్వి
‘‘నా రెండో టీ20 మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది. ఇది ఆరంభం మాత్రమే. నేడు జరగనున్న ఐదో టీ20 కోసం సిద్ధంగా ఉన్నా. మంచి ఆరంభం దొరికితే దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తా. భారత్ తరఫున ఆడటమే ప్రత్యేకత. ఇక అర్ధశతకం చేయడం మరింత ప్రాధాన్యత ఉంటుంది. దీని వెనుక చాలా కఠిన శ్రమ, ఆలోచనలు ఉన్నాయి’’ అని యశస్వి జైస్వాల్ వ్యాఖ్యానించాడు. విండీస్తో నాలుగో టీ20 మ్యాచ్లో యశస్వి 51 బంతుల్లోనే 84 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, మూడు సిక్స్లు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?